భద్రాచలంలో పాచిపోయిన లడ్లు.. ఆగ్రహిస్తున్న రాములోరి భక్తులు

by Mahesh |   ( Updated:2023-01-08 06:35:48.0  )
భద్రాచలంలో పాచిపోయిన లడ్లు.. ఆగ్రహిస్తున్న రాములోరి భక్తులు
X

దిశ, భద్రాచలం టౌన్: దక్షిణ అయోధ్యగా ప్రసిద్ధిగాంచిన భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో కుళ్ళి పాడైన లడ్డూలు విక్రయిస్తున్నారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం సెలవు దినం కావడంతో ఎక్కువ సంఖ్యలో భక్తులు స్వామివారి దర్శనానికి విచ్చేశారు. దర్శనం అనంతరం స్వామివారి ప్రసాదాన్ని కొనుగోలు చేయగా, అందులో లడ్డూలు కుళ్ళి పాడైపోయినవి విక్రయించారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆలయ అధికారులు పట్టించుకోకపోవడం వల్లనే ఇలా జరుగుతోందని, గతంలో కూడా ఈ ఆలయంలో ఇలాంటి ఆరోపణలు వచ్చాయని అయినప్పటికీ అధికారులు బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారని భక్తులు మండిపడుతున్నారు. ఈ సంఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. భక్తుల ఆరోపణలపై వివరణ కోరేందుకు అధికారులు ఎవరూ అందుబాటులో లేరు.

Also Read..

దశాబ్దాల కల నెరవేర్చిన ఎమ్మెల్యే రఘునందన్ రావు..



Next Story

Most Viewed