- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
సంక్షేమ పథకాలతో గ్రామాల అభివృద్ధి: MLC తాతా మధు

దిశ, ఎర్రుపాలెం: ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు ఎమ్మెల్సీ తాతా మధు, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజులు అన్నారు. ఆదివారం మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు పంబి సాంబశివరావు అధ్యక్షతన బుచ్చిరెడ్డిపాలెం లో ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దళిత బంధు, కల్యాణలక్ష్మి, రైతు బీమా, రైతుబంధు తదితర అనేక సంక్షేమ పథకాలతో అర్హులందరికీ లబ్ధి చేకూరిందన్నారు. టీఆర్ఎస్ పాలన విషయంలో ప్రజలు సంతృప్తిగా ఉన్నారన్నారు. కాంగ్రెస్ నాయకులు అనవసరంగా రైతులను మోసం చేస్తున్నారని విమర్శించడం తగదన్నారు.
గ్రామాల్లో టీఆర్ఎస్ మరింత బలోపేతం చేసేందుకు 100 ఓట్లకి ఒక ఇన్చార్జిని ఏర్పాటు చేయాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ రంగశెట్టి కోటేశ్వరరావు, ఎంపీపీ దేవరకొండ శిరీష, జడ్పీటీసీ శీలం కవిత, మధిర ఏఎంసీ మాజీ చైర్మన్ లు చిత్తారు నాగేశ్వరరావు, రామకృష్ణ, ఎంపీటీసీ కిషోర్ బాబు, సంక్రాంతి కృష్ణారావు, ఎర్రుపాలెం వైస్ చైర్మన్ మూల్పురి శ్రీనివాసరావు, అయ్యవారిగూడెం సొసైటీ చైర్మన్ అనుమోలు సాంబశివరావు, మొగిలి అప్పారావు, స్వప్న, బుర్ర వెంకటనారాయణ, ఆకుల నాగేశ్వరరావు, దేవరకొండ చిరంజీవి, దేవరకొండ రవి తదితరులు పాల్గొన్నారు.