'ఖమ్మంలో ప్రత్యేక ఐటీడీఏను ఏర్పాటు చేయాలి'

by S Gopi |
ఖమ్మంలో ప్రత్యేక ఐటీడీఏను ఏర్పాటు చేయాలి
X

దిశ, కామేపల్లి: ఖమ్మంలో ప్రత్యేక ఐటీడీఏను తక్షణమే ప్రభుత్వం ఏర్పాటు చేయాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి దుగ్గి కృష్ణ కోరారు. ఆదివారం కామేపల్లిలో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు వజ్జ రామారావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఏళ్ల తరబడి పోడు భూములు సాగు చేసుకుంటున్న ప్రతి రైతుకు హక్కు పత్రాలను అందజేసి ఆదుకోవాలన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం చేస్తున్న ప్రత్యేక సర్వేను నిష్పక్షపాతంగా నిర్వహించాలని అన్నారు. పోడు భూములకు సంబంధించిన ప్రతి విషయంను ఎఫ్ఆర్సీల ద్వారానే కొనసాగించాలని తెలిపారు. ఏజెన్సీలో పోడు భూములు సాగు చేస్తున్న గిరిజన, గిరిజనేతర పేదలందరికీ హక్కు పత్రాలను అందించాలని అన్నారు. పోడు భూముల సాగుదారులకు ప్రభుత్వం రైతు భీమా, రైతుబంధు, విద్యుత్ బోర్ మంజూరు చేయాలని కోరారు. అర్హులైన గిరిజన లబ్ధిదారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించాలని తెలిపారు. ఏజెన్సీ గ్రామాలలో గిరిజనులందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను సైతం అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు కడపటి సీతారామయ్య, ఎల్లబోయిన రాఘవులు, సూరపాక ధనమ్మ, పొడుగు పెంటయ్య, కిన్నెర రామచంద్రయ్య, ఎట్టి రాములు తదితరులు పాల్గొన్నారు.



Next Story