వీధి కుక్కల దాడితో జింక మృతి

by Sridhar Babu |
వీధి కుక్కల దాడితో  జింక మృతి
X

దిశ, సత్తుపల్లి : సత్తుపల్లి పట్టణంలోని అర్బన్ పార్కులోని పాల జింకలు వరుసగా వీధి కుక్కల పాలవుతున్నాయి. వన్య ప్రాణులను పరిరక్షించాల్సిన ఉద్యోగుల నిర్లక్ష్యం వల్ల వన్య ప్రాణులు వరుసగా మృతి చెందుతున్నాయి. అర్బన్ పార్క్ నుంచి ఆంజనేయస్వామి టెంపుల్ మీదుగా గౌరి గూడెం చేరుకున్న జింకను వీధి కుక్కలు వెంబడించి గాయపరచడంతో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఈ సమాచారం అందుకున్న ఫారెస్ట్ సిబ్బంది జింక కళేబరాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికైనా ఫారెస్ట్ అధికారులు స్పందించి వన్య ప్రాణులను కాపాడాలని ఈ ప్రాంత ప్రజలు కోరుకుంటున్నారు.



Next Story

Most Viewed