- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
అలంకారప్రాయంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు

దిశ, ఏన్కూర్: రైతే రాజు.. రైతు లేనిదే రాజ్యం లేదు. రైతు దేశానికి వెన్నెముక అంటూ ఊక దంపుడు ఉపన్యాసాలు ఇచ్చే నాయకులు. రైతులు బాధలు పడుతున్న కనికరించని అధికారులు కూడా లేకపోవడం శోచనీయం. ఐకేపీ ఆధ్వర్యంలో గత 20 రోజులు క్రితం ఏనుకూరు మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను స్థానిక శాసనసభ్యుడు మాలోతు రామదాసు నాయక చేతుల మీదుగా అటాసంగా ప్రారంభించారు. ఐకేపీ అధికారులు సూచన మేరకే స్థానిక శాసనసభ్యుడు వచ్చి లాంచనంగా దానం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగింది. ఇక్కడున్న అధికారులు ఒక బస్తా ధాన్యం కూడా ప్రారంభించిననాటి నుండి ఈరోజు వరకు ఒక్క బస్తా కూడా కొనుగోలు చేయలేదని ఆరికాయలపాడు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిల్లులు కేటాయింపు జరగకుండానే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏ విధంగా ప్రారంభిస్తారని అధికారులు తీరు పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆరికాల పాడు ధాన్యం కేంద్రాల్లో సుమారు 80 లారీల వరకు కల్లాలలో ఆరబోసి ఉన్నాయి. వర్షం వస్తే ఎవరు బాధ్యత వహించాలని రైతులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వాన్ని చెడ్డ పేరు వచ్చే విధంగా వ్యవహరించడంతో కలెక్టర్ స్పందించాల్సిన అవసరం ఉంది. ఐకేపీ అధికారులు ధాన్యం కొనుగోలు కేంద్రం వైపు వచ్చిన దాఖలాలు కూడా లేవని రైతులు తెలిపారు. వర్షం వస్తే కల్లాల్లో ఉన్న ధాన్యం పై కప్పుకోవడానికి టార్పాలిన్ పట్టాలు కూడా లేకపోవడం రైతులను విస్మయానికి గురిచేస్తుంది. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి మిల్లులు కేటాయింపు జరిపి కల్లాల లో ఉన్న ధాన్యాన్ని తక్షణమే ఎగుమతి జరిగేలా చూడాలని రైతులు కోరుతున్నారు.
20 రోజులు అయింది వడ్లు ఎండి.. ఒక బస్తా కూడా కొనుగోలు చేయలేదు : తాళ్లూరు వెంకటేశ్వరరావు, రైతు
కల్లాల లో ఉన్న ధాన్యం ఎండి 20 రోజులు అవుతుంది. ఒక బస్తా కూడా ఎగుమతి జరగలేదు. అధికారులు నిమ్మకు నీరు ఎత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు. ధాన్యం కొనుగోలు చేయనప్పుడు ఎందుకు కొనుగోలు కేంద్రాలని ఓపెనింగ్ చేయాలి. అధికారులు త్వరలో చూపి త్వరగా కొనుగోలు జరిగేలా చర్యలు తీసుకోవాలి
కొనుగోలు కేంద్రం ఓపెనింగ్ చేశారు వెళ్ళిపోయారు : కాంతారావు, రైతు, ఆరికాలపాడు
ఓపెనింగ్ రోజు వచ్చారు అధికారులు కొనుగోలు కేంద్రాలు తెరిచారా, అమ్మకాలు జరుగుతున్నాయా, కాంటాలు వేస్తున్నారా, ఏమి చూడకుండా ఎమ్మెల్యే మెప్పుకోసం ఓపెనింగ్ రోజు వచ్చి స్వీట్ ప్యాకెట్లు తిని వెళ్లిపోయారు. రైతులు ఇబ్బందులు పట్టించుకునే అధికారి లేడు. ఎమ్మెల్యే స్పందించి ధాన్యం ఎగుమతి జరిగే విధంగా చర్యలు తీసుకోవాలి.