- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
కార్డన్ సర్చ్ నిర్వహించిన డీఎస్పీ రమణమూర్తి

దిశ ,ఇల్లందు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ వినీత్ ఉత్తర్వుల మేరకు ఇల్లందు డీఎస్పీ రమణమూర్తి ఇల్లందు పట్టణంలోని స్టేషన్ బస్తి నందు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. స్టేషన్ బస్తి లోని ప్రతి ఇంటిని తనిఖీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా డీఎస్పీ రమణమూర్తి మాట్లాడుతూ.. స్టేషన్ బస్తీలో 32 మోటార్ సైకిల్ , ఎనిమిది ఆటోలు, రెండు కిరాణా షాపులో అంబర్ ప్యాకెట్లు, లిక్కర్ బాటిల్స్ను పట్టుకున్నామని తెలియజేశారు. ఎవరికైతే ఇన్సూరెన్స్ లేదో వారు ఇన్సూరెన్స్ చేయించుకుని వారి మోటార్ సైకిల్ను పోలీస్ స్టేషన్ వచ్చి తీసుకెళ్లొచ్చు అన్నారు. మోటార్ సైకిల్కు ఆర్సీ కాగితాలు లేని బండ్లను కోర్టుకు అప్పచెప్పుతామని అన్నారు. మేము సైతం కార్యక్రమంలో భాగంగా స్టేషన్ బస్తీలోని ప్రజలందరితో డీఎస్పీ మాట్లాడుతూ.. వార్డులోని ప్రధాన రహదారిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకొని పోలీసు వారికి సహకరించాలని దాతలు ఎవరైనా ఉంటే సీసీ కెమెరాలు ఇప్పియ్యాలని పట్టణ అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు సీఐ భానోత్ రాజు ఇల్లందు ఎస్సై రాజేష్, టేకులపల్లి ఎస్సై బి. శ్రీనివాస్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.