- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
దిశ ఎఫెక్ట్ ...ఎడమ కాల్వకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు

దిశ, వైరా : మధ్యతరహకు చెందిన వైరా రిజర్వాయర్ ఎడమ కాల్వకు నీటిపారుదల శాఖ అధికారులు ఎట్టకేలకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టారు. ఎడమ కాల్వ చివరి ఆయకట్టులో ఉన్న గరికపాడు, లింగన్నపాలెం గ్రామాల్లో రైతులు పెంచుతున్న నారుమళ్లకు సాగునీరు అందని విషయమై బుధవారం దిశ దినపత్రికలో నెర్రలు బారిన నారుమళ్లు అనే వార్త కథనం ప్రచురితమైంది. గత వారం రోజులుగా చుక్క సాగునీరు అందక గరికపాడు, లింగన్నపాలెం గ్రామాల్లో నారుమళ్లు నెర్రెలు భారీ ఎండిపోతున్న విషయాన్ని ఈ కథనంలో దిశ వివరించింది. దిక్కు తోచని స్థితిలో గ్రామపంచాయతీ ట్యాంకర్ తో నారుమళ్లను కాపాడుకునేందుకు రైతులు పడుతున్న వ్యథను
దిశ కథనంలో స్పష్టం చేసింది. దీంతో స్పందించిన నీటిపారుదల శాఖ అధికారులు చివరి ఆయుకట్టులోని నారుమళ్లకు సాగునీరు అందించేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నారు. గరికపాడు గ్రామం లోని కాల్వను నీటిపారుదల శాఖ వైరా డీఈ పి.శ్రీనివాస్, ఏఈలు రాణి, వెంకట రాము శుక్రవారం పరిశీలించారు. విప్పలమడక గ్రామంలోని చీలువ కాల్వ నుంచి గరికపాడు గ్రామం వరకు ఉన్న కాల్వలో వలయంగా ఏర్పడి నీటి ప్రవాహాన్ని అడ్డుకుంటున్న పిచ్చి మొక్కలు, గుర్రపు డెక్కలను తొలగించేందుకు
అధికారులు యుద్ధ ప్రాతిపదికన పనులు ప్రారంభించారు. చీలువ కాల్వ నుంచి పొక్లైన్తో కాలువలో ఉన్న పిచ్చి మొక్కలు, గుర్రపు డెక్కలను తొలగించే పనులను గురువారం చేపట్టారు. ఈ పనులను నీటిపారుదల శాఖ సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు. 3 రోజుల్లో ఈ పనులు పూర్తవుతాయని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. దిశ కథనంతో స్పందించి అధికారులు పనులు ప్రారంభించడంతో రైతులు దిశకు కృతజ్ఞతలు తెలిపారు.