- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
తహశీల్దార్ కార్యాలయం ఎదుట గిరిజనులు దర్నా..

దిశ, బూర్గంపాడు: తమ భూములలోకి వచ్చి అటవీశాఖ అధికారులు కొట్టారని.. గిరిజనులు మంగళవారం బూర్గంపాడు తహశీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించారు. సేద్యం చేస్తున్న భూములలోకి వచ్చి మహిళలు అని కూడా చూడకుండా విచక్షణారహితంగా కొట్టారని, అధికారులపై చర్యలు తీసుకోవాలని.. గిరిజనులు తహశీల్దార్ కార్యాలయం ఎదుట దర్నా చేశారు. సోమవారం ఉదయం మాకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా, హక్కుల నిర్ధారణ కూడా జరగకుండా.. తమ భూములలోకి వచ్చి అటవీశాఖ అధికారులు కొట్టారని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో గిరిజనులు మా సాగు భూములకు పట్టాలు ఇవ్వాలని మంగళవారం తహశీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించారు.
వెంటనే స్పందించిన స్థానిక తహశీల్దార్ భగవాన్ రెడ్డి సమస్యని అడిగి తెలుసుకున్నారు. వీలైనంత త్వరగా ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి దర్యాప్తు చేసి.. న్యాయం చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అప్పటి వరకు గొడవలకు వెళ్లి ఇబ్బందులు పడొద్దని గిరిజనులకు నచ్చచెప్పారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ సేన జిల్లా కన్వీనర్ రవి, సీపీఎం మండల అధ్యక్షులు బత్తుల వెంకటేశ్వర్లు, పుల్లయ్య, సొడే రాజు, మిడియం శ్రీను, సోడే వీరభద్రం, కృష్ణ, కాంచన, రాజారావు పలువురు పాల్గొన్నారు.