ఓవర్ లోడింగ్ తో ప్రమాదాలు

by Sridhar Babu |
ఓవర్ లోడింగ్ తో ప్రమాదాలు
X

దిశ , మణుగూరు : మణుగూరు మున్సిపాలిటీలోని రాజుపేట మూలమలుపు ప్రమాదాలకు నెలవుగా మారింది. మణుగూరు ఓపెన్ కాస్ట్ నుండి నిత్యం బొగ్గులారీలు, టిప్పర్లు ఓవర్ లోడ్ తో ప్రయాణిస్తుండడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. రక్షణతో కూడిన ఉత్పత్తి సాధించాలనే సింగరేణి అధికారులకు ఓవర్ లోడింగ్ తో రోడ్లపైకి వచ్చే టిప్పర్లు, లారీల వల్ల ప్రమాదాలు జరగవా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఓవర్ స్పీడ్ తో పాటు మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిని లోడింగ్ వద్ద సింగరేణి అధికారులు ఎందుకు గుర్తించడంలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

తప్పిన పెను ప్రమాదం....

గురువారం రాజుపేట మూల మలుపు వద్ద పెను ప్రమాదం తప్పింది. ఓవర్ లోడింగ్ తో వస్తున్న బొగ్గు టిప్పర్ రోడ్డు పక్కనే ఉన్న జనంపైకి దూసుకెళ్లింది. డ్రైవర్ మద్యం సేవించి నడపడంతో పాటు..అధిక లోడు వల్ల ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని లేకుంటే భారీ ప్రమాదం జరిగి ఉండేదని తెలిపారు.



Next Story

Most Viewed