గండం గడిచింది.. శాంతించిన గోదావరి

by Sumithra |
గండం గడిచింది.. శాంతించిన గోదావరి
X

దిశ, భద్రాచలం : భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహ ఉధృతి తగ్గింది. శనివారం అర్దరాత్రి 56.10 అడుగులకు చేరుకున్న గోదావరి, ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు 52.60 అడుగులకు చేరుకోవడంతో మూడవ ప్రమాద హెచ్చరిక ఉపసంహరించారు.

అనంతరం ఆదివారం తెల్లవారు జాము 3 గంటలకు గోదావరి 47.60 అడుగులకు తగ్గడంతో రెండవ ప్రమాద హెచ్చరిక ఉపసంహారించిన అధికారులు, సోమవారం మధ్యాహ్నం ఒంటి గంటకు మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయుకి తగ్గి 42.60 అడుగుల మేర ప్రవహిస్తుండటంతో మొదటి ప్రమాద హెచ్చరికను కలెక్టర్ ఉపసంహారించారు. ప్రస్తుతానికి గండం గడిచిందని లోతట్టు ప్రాంత వాసులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.



Next Story