- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
గన్ ఫైరింగ్ కేసును ఛేదించిన సైబరాబాద్ పోలీసులు

దిశ, శామీర్ పేట: అర్ధరాత్రి ఉద్దమర్రి వైన్స్ వద్ద కాల్పులు జరిపి నగదు దోచుకెళ్లిన అంతర్రాష్ట్ర రాజస్థాన్ భరత్ పూర్ ముఠాను అదుపులోకి తీసుకున్నట్లు మేడ్చల్ డీసీపీ సందీప్ రావు మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో తెలియజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గత నెల 23న రాత్రి 10 గంటల సమయంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మూడు చింతలపల్లి మండల పరిధిలోని ఉద్దేమర్రిలో ఉన్న వినాయక వైన్స్ ను సిబ్బంది మూసి వెళ్తుండగా పల్సర్ మోటార్ బైక్ పై ముసుగులు ధరించి వచ్చిన ఇద్దరు దుండగులు వైన్ సిబ్బంది వద్ద నగదు దోచుకుని వెళ్లే క్రమంలో తోపులాట జరగడంతో దుండగులు క్యాషియర్ బాలకృష్ణ హెల్పర్ జయపాల్ రెడ్డి ప్రతిఘటించారు. ఈ క్రమంలో హెల్పర్ జయపాల్ రెడ్డిని కర్రతో కొట్టారు. అంతే కాకుండా బాలకృష్ణపై A1 నాసిర్ కాల్పులు జరిపి అతని వద్ద ఉన్న రూ.2లక్షల నగదు దోచుకెళ్లారు. దీంతో కేసులు సవాలు తీసుకున్న పోలీసులు నిందితుల ఆచూకీకి ఎనిమిది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విచారణను వేగవంతం చేసి నిందితులైన A1 మొహమ్మద్ నాసిర్, A3 సమూన్ అలియాస్ మహమ్మద్ సమున్ ఖాన్, A4, తారిఖ్ మొహమ్మద్ తారీఫ్ పట్టుకున్నట్లుగా ఆయన తెలిపారు, A2 ఆరిఫ్ ఖాన్ పరారీలో ఉన్నారని తెలియజేశారు. నిందితులంతా.. రాజస్థాన్ వాసులని వారి నుంచి ఓ బజాజ్ పల్సర్ బైక్, రెండు మొబైల్ ఫోన్లు, ఓ నాటు తుపాకీ, రూ.30వేల నగదు మూడు ఫైర్ అయిన బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నట్లుగా డీసీపీ తెలిపారు. A1గా ఉన్న నిందితుడు నాసిర్ తో పాటుగా దొరికిన ఇద్దరు నేరస్థులు మూడు చింతలపల్లిలో నివాసం ఉంటూ జేసీబీ ఆపరేటర్లుగా పనిచేస్తున్నారు. వారంతా ఓ ముఠాగా ఏర్పడి పథకం ప్రకారం వైన్స్ లో నగదు దొంగతనం చేసేందుకు ప్లాన్ వేశారు. అందుకు ఓ బైక్ అవసరం ఉందని గ్రహించి ముందుగా తుర్కపల్లిలో స్ల్పెండర్ బైక్ ను దొంగలించారు. కానీ, ఆ వాహనం సరిగ్గా నడవకపోవడంతో యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి లో పల్సర్ వాహనాన్ని దొంగిలించారు. ఓ నాటు తుపాకిని రాజస్థాన్ నుంచి కొనుగోలు చేసి ఉద్దమర్రి వైన్స్ ను దొచుకునేందుకు కాల్పులు జరిపారని డీసీపీ తెలిపారు. వీరిపై ఇంతకు ముందు మరెన్నో.. నేరాలు వివిధ పోలీస్ స్టేషన్లో నమోదు అవడంతో పీడీ యాక్ట్ నమోదు చేయనున్నట్లుగా ఆయన తెలిపారు. అనంతరం పేట్ బషీరాబాద్ ఏసీపీ ఆధ్వర్యంలో గన్ ఫైరింగ్ కేసును చెందించిన సీసీఎస్ బాలానగర్, ఎస్ వో టీ బాలానగర్, డీఐ శామీర్ పేట, ఇన్స్పెక్టర్ శామీర్ పేట్ ను డీసీపీ అభినందించారు.