- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
సారపాకలో గంజాయి పట్టివేత

దిశ, బూర్గంపాడు : బూర్గంపాడు మండల పరిధిలోని సారపాకలో గురువారం భారీగా గంజాయి పట్టుబడింది. ఇందుకు సంబంధించిన వివరాలను బూర్గంపాడు ఎస్ఐ పి.సంతోష్ విలేకరులకు తెలిపారు. సారపాకలో ఎస్ఐ సంతోష్ తన సిబ్బందితో కలిసి వాహన తనీఖీలు చేపట్టారు. ఈ క్రమంలో భద్రాచలం నుంచి పాల్వంచ వైపునకు వెళ్తున్న ఐషర్ వ్యాన్ పోలీసులను చూసి అపకుండా వెళ్తుండగా వెంబడించి ఐటీసీ స్కూల్ దగ్గర పట్టుకున్నారు. వ్యానును తనీఖీ చేయగా ఒక ప్రత్యేక డబ్బా ఏర్పాటు చేసుకుని దానిలో పది బస్తాలలో 196.7 (96 ప్యాకెట్లు) కేజీల గంజాయిని గుర్తించారు. గంజాయి విలువ మూడు కోట్ల 93 లక్షల 24 వేల రూపాయలు ఉంటుందని తెలిపారు.
పట్టుబడిన వ్యక్తులు మహారాష్ట్రలోని చాలిన్గాన్ ప్రాంతానికి చెందిన లారీ డ్రైవర్ ఫారూఖ్ అల్తాఫ్ షేక్, దూలే ప్రాంతానికి చెందిన క్లీనర్ షేక్ ఖలీల్ గా తెలుసుకున్నారు. వారిని విచారించగా అరకు ప్రాంతం నుంచి గంజాయి రవాణా చేస్తున్నట్లు అంగీకరించారు. ఆజాద్ అనే వ్యక్తి అరుకు పారెస్ట్ లో గురు అనే వ్యక్తి నుండి గంజాయి తీసుకుని నాందేడకు తరలిస్తే రూ.10వేలు చెల్లిస్తానని తెలపడంతో గంజాయి రవాణాకు పాల్పడినట్లు నిందితుల ద్వారా తెలుసుకున్నారు. వాహనాన్ని పోలీస్ స్టేషన్ కు తరలించి నలుగురు నిందితులతో పాటు లారీ యాజమాని సయ్యద్ ఖదీర్ పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సంతోష్ తెలిపారు. ఆజాద్, గురు, ఖదీత్- అనే వ్యక్తులు పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో ఎస్ఐ సంతోష్ తోపాటు అదనపు ఎస్ఐ శ్రీనివాస నాయక్, సిబ్బంది పాల్గొన్నారు.