పారిశుద్ధ్య కార్మికులకు సీపీఎం నాయకుల సంఘీభావం

by Sridhar Babu |
పారిశుద్ధ్య కార్మికులకు సీపీఎం నాయకుల సంఘీభావం
X

దిశ, కూసుమంచి : కూసుమంచి మండల పరిషత్ కార్యాలయం వద్ద గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికుల సమ్మె శిబిరం వద్ద సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోతినేని సుదర్శన్, ఖమ్మం జిల్లా కమిటీ సభ్యులు బండి రమేష్, కూసుమంచి మండల సీపీఎం కార్యదర్శి రమణారెడ్డి తదితరులు గ్రామపంచాయతీ కార్మికులకు సమ్మెకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా పోతినేని సుదర్శన్ ప్రసంగిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి పారిశుద్ధ్య కార్మికుల పట్ల వివక్ష చూపడం సబబు కాదని, సమ్మె చేస్తున్న గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలపై ఇప్పటి వరకు స్పందించక పోవడం సరికాదని ఆయన అన్నారు.



Next Story

Most Viewed