- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
'తెలంగాణలో పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది'

దిశ, వైరా: వ్యవసాయంకు అవసరమైన త్రీపేజ్ విద్యుత్ సరఫరాపై నియంత్రణ విధించడంతోపాటు వ్యవసాయ పంపు సెట్లకు ఉపయోగించే ఆటో స్టార్టర్లు తీసివేయాలని, రైతులు నీరు, విద్యుత్ వృథా చేస్తున్నారని జెన్ కో, ట్రాన్స్ కో సీఎండీ ప్రభాకరరావు చేసిన ప్రకటనను బేషరతుగా ఉపసంహరించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బొంతు రాంబాబు డిమాండ్ చేశారు. వైరాలోని బోడేపూడి వెంకటేశ్వరరావు భవన్ లో బుధవారం జరిగిన సీపీఎం సుందరయ్య నగర్ శాఖ సమావేశంలో అయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయంకు అవసరమైన విద్యుత్ ను 24 గంటలు నిరంతరాయంగా సరఫరా చేస్తున్నామని గత ఎనిమిది సంవత్సరాలుగా ప్రకటిస్తుందన్నారు. గత పదిహేను రోజుల నుంచి విద్యుత్ కోతలు తీవ్రమై రైతులు ఇబ్బందులు పడుతున్నారని పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని వివరించారు.
విద్యుత్ సరఫరాలో తలైతిన సమస్య ప్రభుత్వం బహిరంగ పర్చాలని డిమాండ్ చేశారు. యాసంగి సీజన్ లో పంటలకు విద్యుత్ సరఫరాలో నియంత్రణ చేసి కోతలు విధించడంతోపాటు మోటార్ల ఆటో స్టార్టర్లు తొలిగించాలని సీఎండీ ప్రభాకరరావు ప్రకటన చేయడం రైతులను నష్టపరచటమేనన్నారు. ఒక్క ప్రక్కన నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయకుండా దఫా దఫాలుగా విద్యుత్ సరఫరా చేస్తూ అర్థరాత్రి సమయంలో వ్యవసాయానికి విద్యుత్ సరఫరా చేస్తూ ఆటో స్టార్టర్లు తీసివేయాలని అని రైతులను బెదిరించే విధంగా ప్రకటనలు చేయడం సరికాదన్నారు. రైతులకు పగటి పూట విద్యుత్ నిరంతరాయంగా సరఫరా చేయాలని కోరారు. సమావేశంలో సీపీఎం వైరా పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు బొంతు సమత, శాఖ కార్యదర్శి మందడుపు రామారావు, ఎస్ కె జామాల్,నారికొండ అమరేంద్ర, శీలం నారాయణ రెడ్డి, వడ్లమూడి మధు తదితరులు పాల్గొన్నారు.