- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
నకిలీ కరెన్సీ ముఠా అరెస్ట్

దిశ, పాల్వంచ : మూడు రోజుల క్రితం అల్లూరి సీతారామరాజు జిల్లా వీఆర్ పురం మండలం రేఖపల్లిలో నకిలీ కరెన్సీ నోట్లను చలామణి చేస్తున్న పాల్వంచకు చెందిన ఓ ముఠాను అక్కడి పోలీసులు పట్టుకున్న విషయం తెలిసిందే. ఈరోజు చింతూరు ఐటీడీఏ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ వివరాలను వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన పొదిలి మురళి, జంగం శ్రీనివాస్, కటారి సామ్రాజ్యం, గౌడు గొల్ల కిరణ్ కుమార్, వేముల పుల్లారావు, కొనకాళ్ల చిట్టిబాబు, పొదిలి శ్రీనివాస్, పాకనాటి నాగేశ్వరరావు, పసుపులేటి ఉమేష్ చంద్ర కలిసి ఓ ముఠాగా ఏర్పడి నకిలీ కరెన్సీని చలామణి చేస్తుండగా విశ్వసనీయ సమాచారం ప్రకారం వీఆర్ పురం పోలీసులు ముఠాను అరెస్టు చేసినట్లు వివరించారు.
నిందితుల నుంచి రూ. 45 లక్షల విలువ చేసే నకిలీ నోట్లు, మూడు ప్రింటర్స్, ఒక కంప్యూటర్, ఆటో స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులు అందరూ కలిసి ఒక ముఠా గా ఏర్పడి పాల్వంచలో పొదిలి మురళి ఇంటి వద్ద దొంగ నోట్ల ను ముద్రించారు. దొంగ నోట్ల ముద్రణకు కావలసిన పెట్టుబడులు గౌడగొల్ల కిరణ్ కుమార్ అందించాడు అని తెలియజేశారు. జంగం శ్రీనివాస్ ,కొనకాళ్ల చిట్టిబాబు, వేముల పుల్లారావు నకిలీ నోట్లు ప్రింట్ చేసేవారని, ప్రింట్ చేసిన నకిలీ నోట్లను భద్రాచలం, ఎటపాక ,చింతూరు, వీఆర్ పురం కుంట గ్రామాల్లో చలామణి చేశారని నకిలీ లక్ష రూపాయల కరెన్సీకి ఒరిజినల్ పదివేల రూపాయలు కిరణ్ కుమార్ కు చెల్లిస్తూ ఉండేవారని, రద్దీ ప్రదేశాల్లో ,పెట్రోల్ బంకులలో, కిరాణా షాపుల్లో,హోటల్స్ లో చెలామణి చేసేవారని తెలిపారు. దొంగ నోట్లను రాత్రి వేళల్లో మార్పిడి చేసేవారని. వారందరినీ అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. నిందితులను అరెస్ట్ చేసిన అనంతరం రిమాండ్ కు తరలించారని పేర్కొన్నారు.