- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
రెవెన్యూ శాఖలో కలెక్షన్ కింగ్.. ప్రతి పనికి ఓ రేటు

దిశ, దుమ్ముగూడెం: మండలంలోని తహశీల్దార్ కార్యాలయంలో అతనొక చిన్న అధికారి. కానీ అతను చేసే అవినీతి అక్రమాలు అంతా ఇంతా కాదు. కార్యాలయానికి వచ్చే ప్రజల వద్ద ముక్కు పిండి మరీ వసూలు చేస్తున్నారు. దుమ్ముగూడెం మండలంలోని 37 గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్న తదితర గ్రామాల నుంచి అధికంగా తమ పనులకోసం రెవెన్యూ కార్యాలయానికి ప్రజలు వస్తుంటారు. జనన, మరణ ఆన్లైన్ దరఖాస్తులు సబ్ కలెక్టర్ కార్యాలయానికి ఫార్వర్డ్ చేయాలన్నా, ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేసేటప్పుడు మినిమం రు.2-5 వేలు ఇవ్వనిదే పని జరగదన్నట్లగా తెలుస్తోంది. తహశీల్దార్ సంతకం చేసినా సరే అక్కడి నుంచి ఆయన వద్దకు ఆ ఫైల్ వెళ్లిందంటే మాత్రం ముడుపులు లేనిదే ఇతని వద్ద నుండి ఆ ఫైల్ కదలదు.
అంతే కాకుండా కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల్లో ఇతని వాటా వేలల్లో ఉంటుందని బయట నుంచి వచ్చే పుకార్లే కాకుండా కార్యాలయ సిబ్బంది సైతం గుసగుసలాడుతునట్లు తెలుస్తోంది . అతనికి వాటాలు ఇవ్వక పోతే నెలల తరబడి కార్యాలయం చుట్టూ తిరిగిన వారు ఎందరో ఉన్నారు. ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాల్లో సైతం ప్రజల వద్దనుండి దౌర్జన్యంగా వసూలు చేస్తున్నట్లు మండల ప్రజలు వాపోతున్నారు. ఎన్నోసార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. రెవెన్యూ కార్యాలయం వేదికగా ఇతను చేసే అవినీతి, అక్రమాలు పరాకాష్టకు చేరాయి. మండల రెవెన్యూ కార్యాలయంలో జరిగే అవినీతి, అక్రమాలపై తహశీల్దార్కు దిశ వివరణ కొరకు కాల్ చేయగా కాల్ లిఫ్ట్ చేయలేదు.