- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
గురుకులాల్లో కార్పొరేట్కు ధీటుగా విద్య : ఎమ్మెల్సీ తాతా మధుసూదన్

దిశ, చర్ల : తెలంగాణ గురుకులాల్లో కార్పొరేట్కు ధీటైన విద్య అందిస్తున్నామని ఉమ్మడి ఖమ్మం ఎమెల్సీ తాతా మధుసూధన్ అన్నారు. పాల్వంచ మండలంలోని కిన్నెరసాని స్పోర్ట్స్ స్కూల్ మైదానంలో భద్రాచలం ఐటీడీఏ ఆధ్వర్యంలో నాలుగు రోజులపాటు జరిగే రాష్ట్రస్థాయి ఇంటర్ సొసైటీ లీగ్ క్రీడలను భద్రాచలం ఐటీడీఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇంటర్ సొసైటీ లీగ్ క్రీడలను సోమవారం రాష్ట్రప్రభుత్వ విప్ రేగా కాంతారావు, కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ లతో కలిసి ఆయన ప్రారంభించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఆయనకు ముందుగా పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడలను ప్రారంభించారు. అధికారులతో కలిసి క్రీడాకారుల మార్చ్ ఫాస్ట్ ద్వారా గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని,తదుపరి క్రీడా పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ మాట్లాడుతూ విద్యతోనే విద్యార్థులకు వికాసం కలుగుతుందన్నారు. అందుకే సీఎం కేసీఆర్ రాష్ట్రంలో విద్య, వైద్యానికి పెద్ద పీట వేశారని తెలిపారు. విద్య ఆవశ్యకతను గుర్తించిన సీఎం కేసీఆర్ రాష్ట్రంలో 1000 కి పైగా గురుకులాలను ఏర్పాటు చేశారని, తద్వారా కార్పొరేటుకు దీటుగా నాణ్యమైన విద్యనందిస్తున్నారని తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. చదువుతోపాటు క్రీడాలలోనూ విద్యార్థులు రాణించాలని సూచించారు. క్రీడలలో గెలుపు ఓటములు సహజమని, ఓటమిని కూడా ప్లేయర్స్ ఎంతో స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని గిరిజన, దళిత, మైనార్టీ విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. తెలంగాణ ప్రభుత్వం గిరిజన విద్యార్థుల ప్రగతికి పెద్దపీట వేస్తున్నదన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, జిల్లా కలెక్టర్ అనుదీప్ జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య, రాష్ట్ర, జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.