- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఆ గురువు స్టైలే వేరు.. పగలు పాఠాలు..రాత్రులు చేసే పనిపై విమర్శలు

దిశ,మణుగూరు: విద్యను బోధించే గురువు విద్యార్థులకు పరిజ్ఞానాన్ని, ధనాత్మక తీర్పును, జ్ఞానాన్ని ఇవ్వడమే అతని లక్షణమంటారు. విద్యార్థులలో దాగివున్న అంతర్-జ్ఞానాన్ని వెలికి తీయడమే గురువు యొక్క లక్షణం.కానీ విద్యార్థులకు మంచి బుద్ధులు చెప్పాల్సిన గురువే పలు నీచపు పనులకు అలవాటు పడితే మరి విద్యార్థుల పరిస్థితి ఏంటి అనేది సమాజంలో అంతుచిక్కని ప్రశ్నగా మారింది. గురువు అంటూ విద్యార్థులలో దాగి ఉన్న ట్యాలెంట్ను వెలికి తీస్తాడు. కానీ, ఇక్కడ మాత్రం ఓ విద్యా సంస్థ కరస్పాండెంట్ తనలో ఉన్న నీచపు పనుల టాలెంట్ను బయటకు వెలికి తీసుకోవడం సంచలనంగా మారింది.
భూకబ్జాలకు పాల్పడుతున్న ఓ విద్యా సంస్థ కరస్పాండెంట్..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలో ఆ విద్యసంస్థ పేరు తెలియని వారు ఎవరు ఉండరు. అయితే ఆ విద్యా సంస్థ కరస్పాండెంట్కు మణుగూరు మండలంలో భూకబ్జాలు చేయడం పరిపాటిగా మారింది. ఒక అగ్రకులానికి చెందిన ఆయన ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన భూములు, ప్రభుత్వ భూములు కబ్జా చేయడం మండలంలో సంచలనంగా రేపుతోంది. మండలంలో ఎక్కడ ప్రభుత్వ భూమి ఉన్న దానిపై కన్ను వేయడం,తన అనుచరులతో కబ్జా చేయించడమే ఆయన జీవిత లక్ష్యమని పలువురు అనుకుంటున్నారు. అమాయకమైన గిరిజనులను బెదిరించి,గిరిజనుల భూములను దోచుకుంటున్నాడని స్థానికంగా కొందరు వాపోతున్నారు. మండలంలో దాదాపు కొన్ని ఎకరాల ప్రభుత్వ భూములను తన అనుచరులతో కబ్జా చేసి కోట్ల రూపాయలను అక్రమంగా సంపాదించాడని పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విద్యా సంస్థ కరస్పాండెంట్ పై జిల్లా అధికారులు దృష్టి పెడితే కొన్ని ప్రభుత్వ భూములు,గిరిజన భూములు బయట పడతాయని స్థానికులు చర్చించుకుంటున్నారు.
ప్రభుత్వ భూములు,ఇండ్ల స్థలాలే ఈయన టార్గెట్..
మనిషి ఒక మాట..గొడ్డుకి ఒక దెబ్బ అని మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉంటున్నాం. అయితే ఈవిద్య సంస్థ కారస్పాండెంట్కు మనిషి లాగా ఒక మాట చెప్పినా, గొడ్డు లాగా ఒక దెబ్బ కొట్టిన ఆయన జీవితం మారని తీరని స్థానికంగా కొందరు అనుకుంటున్నారు. మండలంలో ఎక్కడ చూసినా ప్రభుత్వ భూములు కబ్జా చేసిన వారిలో మొదటి పేరు ఈవిద్య సంస్థ కరస్పాండెంట్ పేరు వినపడటం గమనార్హం. మండలంలో ప్రభుత్వ భూములను టార్గెట్ చేసి కబ్జా చేయడం ఈయన ఆనవాయితీ. ప్రభుత్వాధికారులను మచ్చిక చేసుకొని ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్నాడని స్థానికంగా కొందరు అనకొస్తున్నారు. ఇకపోతే మండలంలో ఉన్న కొన్ని ఇండ్లపై తప్పుడు పత్రాలను సృష్టించి అమాయకమైన వ్యక్తులకు అమ్ముతూ కొన్ని లక్షల రూపాయలు సొమ్ము చేసుకుంటున్నాడని కొందరు అంటున్నారు. స్థానికంగా ఒక ముఠాను ఏర్పచుకుని ప్రభుత్వ భూములు,ఇండ్ల స్థలాలే
టార్గెట్గా చేసుకొని ఓ..నీచపు జీవితం జీవిస్తున్నడనే కొన్ని ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి. మరీ ఈ విద్యా సంస్థ కరస్పాండెంట్ పై జిల్లా ఉన్నతాధికారులు దృష్టి సారిస్తే ప్రభుత్వ భూములు,గిరిజనుల భూములను కబ్జాల నుంచి కాపాడవచ్చని స్థానికంగా ఉండే కొందరు వ్యక్తులు అధికారులను కోరుతున్నారు.
పగలు విద్య సంస్థ..రాత్రులు పేకాట జూదం..
విద్యార్థులకు విద్యను అందించాల్సిన కరస్పాండెంట్ పేకాట జూదంలో పట్టుబడటం అనేది సిగ్గుచేటని కొందరు విద్యార్థుల తల్లిదండ్రులు అనుకుంటున్నారు. స్థానికంగా ఎన్నో సార్లు పేకాట జూదం లో పట్టుబడ్డ సందర్భాలు ఉన్నాయని కొందరు చర్చించుకుంటున్నారు. అలాగే ఈ కరస్పాండెంట్ పై పేకాట జూదం కేసు ఉండటం కూడా గమనార్హం. ఈక్రమంలో ఈవిద్యా సంస్థ కరస్పాండెంట్ను కొందరు విద్యార్థుల తల్లిదండ్రులు ఛీ..కొడుతున్నారనే ఊహాగానాలు మండలంలో జోరుగా వినిపిస్తున్నాయి. పద్ధతి
మార్చుకోమని స్థానికంగా ఉండే కొందరు ప్రముఖులు పలుమారు హెచ్చరించిన ఆయన మాత్రం తన జీవిత తీరును మార్చుకోవడం లేదని కొందరు అంటున్నారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోని సమాజంలో జీవిస్తాడా..లేడానేది వేచి చూడాల్సిందే.. ?