- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
పొంగులేటికి పదవి ఇవ్వడంపై సంబురాలు

దిశ, కారేపల్లి : మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాష్ట్ర ప్రచార కో చైర్మన్గా నియమితులు కావటతో కారేపల్లిలో ఆదివారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో సంబురాలు జరిపారు. సినిమాహాల్ సెంటర్లో కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. రానున్నది కాంగ్రెస్ రాజ్యం... పేదల పెన్నిధి కాంగ్రెస్ అంటూ నినదించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు ఇమ్మడి తిరుపతిరావు మాట్లాడుతూ కాంగ్రెస్లో మాజీ ఎంపీ పొంగులేటికి సముచిత స్ధానం లభించిందన్నారు. కష్ట పడి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకవద్దామన్నారు.
ఈ కార్యక్రమంలో మాధారం సర్పంచ్ అజ్మీర నరేష్, సొసైటీ డైరెక్టర్ బానోత్ హీరాలాల్, మాజీ రైతు బంధు కన్వీనర్ గుగులోత్ శ్రీను, మాజీ సంత చైర్మన్ మల్లెల నాగేశ్వరావు, నాయకులు గుగులోత్ భీముడు, నందరాజ్, ఎస్కె.సైదులు, కడియాల సుధాకర్, సపావట్ నాగులు, ధోనీ, గుగులోత్ ప్రసాద్, రమేష్, మజీద్పాషా, ఆదెర్ల ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.