బీటీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం

by Sridhar Babu |
బీటీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం
X

దిశ, దమ్మపేట : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండల పరిధిలోని రామచంద్రాపురం గ్రామంలో బుధవారం ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు బీటీ రోడ్డు పనులను ప్రారంభించారు. ఐటీడీఏ శాఖ ద్వారా 1.50 కోట్ల నిధులతో రామచంద్రాపురం గ్రామం నుండి లింగాలపల్లి గ్రామం వరకు నిర్మించబోయే బీటీ రోడ్డు రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు, ఎంపీపీ సోయం ప్రసాద్, వైస్ ఎంపీపీ దారా మల్లికార్జునరావు, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రాజేశ్వరరావు, దొడ్డ రమేష్, తహసీల్దార్ స్వామి, ఐటీడీఏ ఏఈ, సర్పంచ్లు జయ, సుగుణ, రాము, ఎంపీటీసీ మన్నెం విజయలక్ష్మిఅప్పారావు, నాయకులు దారా యుగంధర్, జిన్నా పాల్గొన్నారు.



Next Story

Most Viewed