నాసిరకం గ్రావెల్ తో బ్రిడ్జి నిర్మాణం..

by Sumithra |
నాసిరకం గ్రావెల్ తో బ్రిడ్జి నిర్మాణం..
X

దిశ, పెనుబల్లి : మండల పరిధిలోని రంగారావు బంజర నుండి చౌడారం వెళ్లే రోడ్డులో రైల్వే ట్రాక్ పై బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. ఇటీవల కురుస్తున్న వర్షాలకు ఈ బ్రిడ్జి పై ఉన్న తారు రోడ్డు కృంగిపోయింది.

బ్రిడ్జి నిర్మాణంలో నాసిరకమైన మట్టి ఉపయోగించారని, నాణ్యత ప్రమాణాలను పాటించకుండా బ్రిడ్జి నిర్మాణం చేపట్టారని, అందుకే ఇలా కృంగిపోయిందని, దీనివలన రాత్రి వేళలో బ్రిడ్జిపై వెళ్లేవారికి ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయని, తక్షణమే సంబంధిత అధికారులు దీనికి మరమ్మతులు చేపట్టాలని రంగారావు బంజర, చోడవరం గ్రామస్తులు కోరుకుంటున్నారు.



Next Story

Most Viewed