- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవం

X
దిశ, ఖమ్మం సిటీ : ప్రజాస్వామ్య చరిత్రలో కోట్లాది ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా స్వేచ్ఛ, సమానత్వ హక్కులు కల్పిస్తూ రూపుదిద్దుకున్న భారత రాజ్యాంగానికి విశిష్టమైన స్థానముందని అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్ర బోస్ అన్నారు. భారత రాజ్యాంగం ఆమోదించబడి నేటికి 73 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా హెడ్ క్వార్టర్స్ లో భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి అడిషనల్ డీసీపీ, పోలీస్ అధికారులు, పోలీస్ కమిషనర్ కార్యాలయం స్టాఫ్ ఘనంగా నివాళులర్పించి అనంతరం ప్రతిజ్ఞ పాటాన్ని అందరిచే చేయించారు. కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ ప్రసన్న కుమార్, ఏవో అక్తరూనీసాబేగం, ఆర్ఐ రవి, సీఐ తుమ్మ గోపి, సాంబరాజు సిబ్బంది పాల్గొన్నారు.
- Tags
- khammam
Next Story