- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
నియోజకవర్గ అభివృద్దే లక్ష్యం

దిశ, దమ్మపేట : దమ్మపేట మండలం కేంద్రంలో ఐదు కోట్లతో నిర్మించబోయే సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుకు శనివారం అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గం అభివృద్ధి చేయటమే తన లక్ష్యమని, దమ్మపేట మండల కేంద్రంలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయడం ద్వారా రానున్న రోజుల్లో దమ్మపేటకు కొత్త కళ రాబోతుందని అన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని ప్రజలకు అనిపిస్తేనే వచ్చే ఎన్నికలలో తనకు ఓటు వేయాలని,
లేదంటే ప్రజలు ఎలాంటి తీర్పును ఇచ్చినా స్వాగతిస్తానని అన్నారు. నియోజకవర్గంలో ఇప్పటికే అనేక సీసీ రోడ్లు నిర్మించామని, రానున్న రోజుల్లో నియోజకవర్గంలో ఉన్న మట్టి రోడ్లు అన్నీ సీసీగా మారుస్తానని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గ అభివృద్ధికి నిధులు అడిగిన వెంటనే మంజూరు చేస్తున్నారని, ఆయన్ని నియోజకవర్గ ప్రజలకు గుర్తుంచుకోవాలన్నారు.
అనంతరం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు, పాల్వంచ డీఎస్పీ వెంకటేష్, ఎంపీపీ సొయం ప్రసాద్, వైస్ సర్పంచ్ దారా మల్లికార్జునరావు, సర్పంచులు ఉయ్యాల చిన్న వెంకటేశ్వరరావు, కొర్స సాగర్, రూప్ సింగ్, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు దొడ్డకుల రాజేశ్వరరావు, బీఆర్ఎస్ నాయకులు దారా యుగంధర్, అబ్దుల్ జిన్నా, పగడాల రాంబాబు, రోడ్డు భవనాల శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.