- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఎంజెఫ్ జాతీయ మహాసభను జయప్రదం చేయండి

దిశ, సత్తుపల్లి : ఈనెల 19న హైదరాబాద్ లో జరిగే మాదిగ జర్నలిస్టు ఫోరం (ఎంజెఫ్) జాతీయ మహాసభను విజయవంతం చేయాలని ఆ ఫోరం జిల్లా కన్వీనర్ తడికమళ్ల దేవ పిలుపునిచ్చారు. గురువారం సత్తుపల్లి పట్టణంలో స్థానిక ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై చర్చించి భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక రూపొందించనున్నట్లు తెలిపారు. హైదరాబాదులో జరిగే మాదిగ జర్నలిస్టుల మహాసభకు
అన్ని రాష్ట్రాలకు చెందిన మాదిగ జర్నలిస్టులు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. ఈ సభకు ముఖ్య అతిథిగా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ తో పాటు మరికొంతమంది ప్రముఖులు హాజరకానున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంజెఫ్ సభ్యులు ఇనపనూరి శ్రీనివాసరావు, బొల్లెపోగు సురేష్ ,తడికమళ్ల అప్పారావు, సింగపోగు శివకృష్ణ, కోట అశోక్ రాజా, జిల్లేపల్లి విష్ణు, నల్లంటి మోహన్, గోల్ల మూడి కృష్ణ, ఇనపనూరి రామ్ కి, లంకా రాజేష్, కొత్తపల్లి సుధాకర్ రావు, అలవాల శ్రీనివాసరావు, కోలికపోగు సాయి పాల్గొన్నారు.