- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
పినపాకలో 100 శాతం గెలిచేది ఆ పార్టీయే: సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్

దిశ, మణుగూరు: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పినపాక నియోజకవర్గంలో కచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని కరకగూడెం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ ఆశాభావం వ్యక్తం చేశారు. సోమవారం ములుగు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ములుగు ఎమ్మెల్యే ధనసరి సీతక్కను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే అసంబ్లీ ఎన్నికల్లో పినపాకలో 100శాతం గెలిచేది కాంగ్రెస్ పార్టీయే అని ధీమా వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో టీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వాలు ప్రజల ముందు కుటీల రాజకీయాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వాలు ఎన్ని కుట్రలు చేసిన.. కాంగ్రెస్ గెలుపును అడ్డుకోలేరన్నారు. కాంగ్రెస్ గెలుపును అడ్డుకునే దమ్ముంటే అడ్డుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో మండల యువజన అధ్యక్షులు కునుసోత్ సాగర్, మండల నాయకులు చెన్నూరి రవీందర్, రేగుళ్ల గ్రామ అధ్యక్షులు గోగు కిరణ్ కుమార్, రేగుళ్ల గ్రామ ఉపాధ్యక్షులు కొండ గొర్ల సమ్మయ్య, చెన్నూరి కన్నయ్య, సయ్యద్ ఉమర్ తదితరులు పాల్గొన్నారు.