- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
కాంగ్రెస్ పార్టీ చెప్పేదొకటి.. చేసేది మరొకటి
దిశ, అశ్వారావుపేట : కాంగ్రెస్ పార్టీ చెప్పేదొకటి చేసేది మరొకటని.. మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారని ఖమ్మం జిల్లా బీజేపీ ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు విమర్శించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రంలో ఎన్నికల ప్రచారానికి విచ్చేసిన ఆయనకు పార్టీ మండల అధ్యక్షుడు బండారు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. అనంతరం నిర్వహించిన రోడ్ షోకు ప్రజల నుంచి స్పందన లభించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. త్వరలో జరగబోతున్న లోక్ సభ ఎన్నికల్లో.. ఖమ్మం పార్లమెంట్ లో కొత్త చరిత్ర సృష్టించబోతున్నామన్నారు. నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరిచేందుకు ఖమ్మం ప్రజలు బీజేపీకి పట్టం కట్టనున్నారన్నారు.
అశ్వారావుపేట నియోజకవర్గం తన పుట్టినిల్లు లాంటిదని.. స్థానిక సమస్యలపై తనకి పూర్తి అవగాహన ఉందన్నారు. కాబట్టి తనని గెలిపిస్తే ఇక్కడి సమస్యలను ఢిల్లీకి తీసుకువెళ్లి పరిష్కరిస్తానన్నారు. గత పాలకులు ఏజెన్సీ ప్రాంతమైన అశ్వారావుపేట నియోజకవర్గంలో మెరుగైన విద్య, వైద్య సౌకర్యాలు కల్పించలేదని.. పరిశ్రమలను ఏర్పాటు చేయడంలో విఫలమయ్యారన్నారు. భారతదేశం అంతా మోడీ నాయకత్వంలో అభివృద్ధి చెందుతుందని.. మరి ఖమ్మం పార్లమెంట్ ఏం పాపం చేసుకుందని.. అభివృద్ధికి దూరంగా ఉందని ప్రశ్నించారు. అందుకే ఈ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాల్సిన బాధ్యత ప్రజలకి ఉందన్నారు. తనకు వేసే ఓటు మోడీకి, అభివృద్ధికి, ధర్మంకి వేసినట్లేనని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రంగా కిరణ్, మండల నాయకులు బండారు చంద్రశేఖర్, వాసం పోలయ్య, దేవి, జల్లిపల్లి అరవింద్, ఎస్వీటీ కొండ, నరేష్ తదితరులు పాల్గొన్నారు.