Khammam: వరద ప్రాంతాల్లో పొంగులేటి పర్యటన.. బాధితులకు సంచలన హామీ

by srinivas |   ( Updated:2023-07-29 12:09:53.0  )
Khammam: వరద ప్రాంతాల్లో పొంగులేటి పర్యటన.. బాధితులకు సంచలన హామీ
X

దిశ, వెబ్ డెస్క్: ఖమ్మం జిల్లా వరద ప్రభావిత ప్రాంతాల్లో కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. వరద బాధితులకు చేయూతనిచ్చారు. బాధితలందరికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌పై పొంగులేటి మండిపడ్డారు. గతంలో సీఎం కేసీఆర్ పర్యటించి నిధులు ప్రకటించారని.. అయితే అవి ఇప్పటికీ విడుదల కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే కరకట్ట నిర్మిస్తామని చెప్పారు. వరద బాధితులకు తక్షణమే రూ. 25 వేలు సాయం అందించాలని పొంగులేటి డిమాండ్ చేశారు. చనిపోయిన వారి కుటుంబ సభ్యుల బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని సూచించారు.

కాగా వరుసగా కురిసిన వర్షాలతో ఖమ్మం జిల్లాలో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. దీంతో ఖమ్మం పట్టణంతో పాటు శివారు ప్రాంతంలోకి భారీగా వరద నీరు చేరింది. దీంతో చాలా మంది వరదలో చిక్కుకున్నారు. కొందరైతే బిల్డింగులపైకి ఎక్కి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడిపారు. వరదలపై స్పందించిన ప్రభుత్వం వరదల్లో చిక్కువారిని సురక్షితంగా బయటకు తరలించి పునరావాసం కల్పించారు.



Next Story

Most Viewed