- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
కాంగ్రెస్ బాండ్ పేపర్ బౌన్స్ అయింది
![కాంగ్రెస్ బాండ్ పేపర్ బౌన్స్ అయింది కాంగ్రెస్ బాండ్ పేపర్ బౌన్స్ అయింది](https://www.dishadaily.com/h-upload/2024/05/24/337582-hareesh.webp)
దిశ, ఖమ్మం రూరల్ : అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల బాండ్ పేపర్ బౌన్స్ అయిందని, హామీల అమలు మరిచిన కాంగ్రెస్ను ఇంటికి పంపించాల్సిన బాధ్యత గ్రాడ్యుయేట్లపైనే ఉందని మాజీ మంత్రి తన్నీరు హరీష్రావు అన్నారు. శుక్రవారం రూరల్ మండలం బారుగూడెం వద్ద పాలేరు నియోజకవర్గ ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లగొండ
జిల్లాల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సన్నాహక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు రైతులు పండించిన పంటకు 500 బోనస్ ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన నాలుగు నెలలకే సన్నాలకే ఇస్తామని చెప్పి రైతులకు సున్నం పెట్టిన కాంగ్రెస్ను ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించాలన్నారు. విద్యావంతుడైన ఎనుగల రాకేష్రెడ్డిని అత్యధిక మోజార్టీతో గెలిపించాలన్నారు.
నిరుద్యోగుల వాయిస్ వినిపించాలంటే రాకేష్రెడ్డిని గెలిపించాలి : ఆర్ఎస్ ప్రవీణ్కుమార్
నిరుద్యోగుల సమస్యలను తీర్చాలంటే ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో గుణవంతుండైన రాకేష్రెడ్డికి మొదటి ప్రాధన్యత ఓటేసి గెలిపించాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు. నిజానికి అబద్దానికి జరుగుతున్న మహా యుద్దం అన్నారు. రిజర్వేషన్లను రద్దు చేస్తామని చెప్పిన బీజేపీ ఏ మొఖం పెట్టుకుని ప్రచారం చేస్తుందని అన్నారు. బీజేపీకి ఓట్లు అడిగే నైతిక హక్క లేదన్నారు. 56 కేసులున్న తీన్మార్ మల్లన్నను గెలిపిస్తారో.. విద్యావంతుడైన రాకేష్రెడ్డిని గెలిపిస్తారో గ్రాడ్యుయేట్లు ఆలోచన చేయాలన్నారు.
బ్లాక్ మెయిలర్ తీన్మార్ మల్లన్నను ఓడించండి : రాజ్యసభ సభ్యుడు గాయత్రి రవి
బ్లాక్ మెయిలర్ తీన్మార్ మల్లన్నను ఓడించి, సేవ చేస్తున్న రాకేష్రెడ్డిని గెలిపించాలని రాజ్యసభ సభ్యుడు గాయత్రి రవి అన్నారు. మంచికి చెడుకు జరుగుతున్న ఈ పోటీల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలన్నారు. రైతుబిడ్డ రాకేష్రెడ్డిని గెలిపించి మండలికి పంపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందని ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తాతా మధుసుదన్, మాజీ ఎమ్మెల్యేలు కందాల ఉపేందర్రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, నాయకులు జీవన్కుమార్, బోమ్మెర రామ్మూర్తి, మండల పార్టీ అధ్యక్షులు బెల్లం వేణు, వీరయ్య, ఎంపీపీ బెల్లం ఉమ, జెడ్పీటీసీలు ధనలక్ష్మి, ప్రసాద్, నాలుగు మండలాల కార్యకర్తలు పాల్గొన్నారు.