- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
పెండింగ్ వేతనాలు తక్షణమే చెల్లించాలని ఆందోళన

దిశ,కామేపల్లి : పెండింగ్ వేతనాలను తక్షణమే చెల్లించాలని, జీవో నెంబర్ 60 ప్రకారం పారిశుద్ధ్య కార్మికులకు రూ.16,500, కారో బార్, బిల్ కలెక్టర్ కు రూ.19,500 వేతనం పెంచాలని కామేపల్లి మండల గ్రామపంచాయతీ ఉద్యోగుల సంఘం (టీఆర్ఎస్ కేవీ విభాగ అనుబంధం) అధ్యక్షులు మేకల మల్లికార్జునరావు కోరారు. సోమవారం గ్రామపంచాయతీ ఉద్యోగుల పెండింగ్ వేతనాలను తక్షణమే అందించాలని కోరుతూ సిబ్బంది ఆధ్వర్యంలో కామేపల్లి ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాక్ట్ 2/94 ను రద్దుచేసి పంచాయతీ సిబ్బంది అందరిని పర్మినెంట్ చేయాలని అన్నారు.
కరోబార్, బిల్ కలెక్టర్ స్పెషల్ స్టేటస్ కల్పించాలని, పీఎఫ్, ఈఎస్ఐ, ప్రమాద బీమా సౌకర్యాలు అమలు చేయాలని, విధి నిర్వహణలో మరణించిన ఉద్యోగికి రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రం ను ఎంపీడీఓ శిలార్ సాహెబ్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో కామేపల్లి మండలం గ్రామపంచాయతీ ఉద్యోగులు అజ్మీర రమేష్, వర్ల ఇసాక్, అనంత రాములు, భరత్, పాషా, మేకల రామారావు తదితరులు పాల్గొన్నారు.