- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
గోదావరి ముంపు ప్రాంతాల బాధితుల ఆందోళన

దిశ, భద్రాచలం : గోదావరి వచ్చి ఇళ్లు మునిగి నేటికీ 230 రోజులు గడిచాయి కానీ తమకు ఇంతవరకు పరిష్కారం చూపలేదని గోదావరి బ్రిడ్జి నుండి ఆర్ డీ ఓ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా చేశారు. ఇప్పటి వరకు సమస్యకు పరిష్కారం లభించలేదన్నారు. గోదావరి ముంపు బాధితులు - ఇండ్లు లేని నిరుపేదలు గత 230 రోజులుగా సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ మద్దతుతో నిరవధిక నిరసన దీక్షను చేస్తున్నారు. శాసన సభ్యులకు, మంత్రులకు, అధికారులకు ఎన్ని విజ్ఞప్తులు చేసినా పట్టించుకోవడం లేదు. పైగా ఫారెస్టు సిబ్బంది ఈ నిరుపేదలు, బాధితులపై రెండు సార్లు దాడులు చేశారు. మరోదాడికి సిద్ధపడుతున్నారు. బడాబాబుల చేతిలో ఉన్న భూముల జోలికి వెళ్లకపోగా ప్రభుత్వ భూమిని కూడా ఫారెస్టు వాళ్లు కాజేశారు. పెరుగుతున్న ఎండలు, రాబోయే వర్షాలకు ఈ బాధితులు మరింత ఇబ్బందిపడతారు. కాబట్టి తక్షణం సురక్షిత ప్రాంతంలో అర్హులందరికి ఇంటి స్థలాలు చూపించాలని స్థానికులు కోరుతున్నారు.