మణుగూరు ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట గర్భిణీ బంధువుల ఆందోళన

by Nagaya |
మణుగూరు ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట గర్భిణీ బంధువుల ఆందోళన
X

దిశ, మణుగూరు : గర్భిణీకి వైద్యం అందక పుట్టిన బిడ్డ చనిపోయిందని, తల్లి్కి ప్రాణాపాయం తప్పిందని ఆరోపిస్తూ బంధువులు మణుగూరు ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. చర్ల మండలం తేగడ గ్రామానికి చెందిన ఎస్ డి ముసాబి తొలి కాన్పు కోసం ఈ నెల 12న మణుగూరు 100 పడకల ఆస్పత్రిలో చేరింది. కానీ సకాలంలో వైద్యం అందకపోవడంతోనే కాన్పుకు ముందే కడుపులో ఉన్న బేబి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. మణుగూరులో సరైన వైద్యం అందక మెరుగైన వైద్యం కోసం భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించినా ఫలితం దక్కలేదు. ఆసుపత్రికి రాకముందే బేబి మృతి చెందినట్లు అక్కడి వైద్యులు తెలిపారు. దీంతో ఆగ్రహం చెందిన కుటుంబ సభ్యులు మణుగూరు ఆస్పత్రి వద్దకు చేరకుని ఆందోళన చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు కుటుంబ సభ్యులకు సర్దిచెప్పి ఆందోళన విరమింపచేశారు.



Next Story

Most Viewed