- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తం

దిశ, ఖమ్మం టౌన్ : నాగపూర్ టు అమరావతి గ్రీన్ ఫీల్డ్ హైవే కోసం గతవారం జిల్లా పరిధిలోని రఘునాథపాలెం మండలంలో చేపట్టిన నిర్బంధ సర్వేని వ్యతిరేకిస్తూ బాధితులు ఆందోళన నిర్వహించారు. కనుమూరు వందనం గ్రామాల్లో పోలీస్ పహార మధ్య నిర్వహించిన సర్వే కి వ్యతిరేకంగా నాగపూర్ టు అమరావతి గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే అలైన్మెంట్ మార్చాలని భూనిర్వాత జేఏసీ, అఖిలపక్ష పార్టీలు, రైతు సంఘాల ఆధ్వర్యంలో బుధవారం చేపట్టిన ఈ కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. నిర్బంధ సర్వీస్ సిగ్గు చేటు అంటూ అలైన్మెంట్ మార్చాలని ఎస్ ఆర్ గార్డెన్ నుండి నినాదాలు చేస్తూ రైతు జేఏసీ ఆధ్వర్యంలో అఖిలపక్ష పార్టీల నాయకులు,రైతులు పెద్ద ఎత్తున ప్రదర్శనగా కలెక్టరేట్ వద్దకు చేరుకున్నారు. ఒక్కసారిగా రైతులు కలెక్టరేట్ లోకి చొచ్చుకెళ్లేందుకు యత్నిచ్చారు.
అప్పటికే పోలీసులు కలెక్టరేట్ వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. బారీకేడ్లు పెట్టి కలెక్టరేట్ గేట్లను మూసివేశారు. కలెక్టరేట్ లోనికి వెళ్లేందుకు యత్నించిన రైతులను, రాజకీయ పార్టీల నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రైతులు, పోలీసులు మధ్య వాగ్వాదం జరిగింది. తోపులాటకు దారితీసింది. కలెక్టరేట్ గేటు బయట ఆందోళన కొనసాగించారు. ఈ సందర్భంగా జరిగిన సభా కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ రైతుల భూ పోరాటం తీవ్ర స్థాయికి చేరిందని, రైతులు చూపించే తెగువ, ధైర్యంతోనే పోరాటం విజయం సాధిస్తుందన్నారు. రైతుల పోరాటానికి సీపీఎం పూర్తిగా మద్దతిస్తుందన్నారు. రైతులు చట్ట విరుద్ధంగా వ్యవహరించడం లేదని, ప్రభుత్వమే చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తోందన్నారు. రైతు పోరాటం వీధి పోరాటం కాదని,
చట్టబద్ధమైనదని తెలిపారు. 90శాతం మంది రైతులు అంగీకరిస్తేనే ప్రభుత్వం రైతుల నుండి భూమిని తీసుకోవాలని చట్టంలో ఉందని తెలియజేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అలైన్మెంట్ మార్పు విషయంలో చొరవ తీసుకొని రైతులకు న్యాయం చేయాలని అన్నారు. ఇబ్బంది పెడితే ఖమ్మంను స్తంభింప చేస్తామని హెచ్చరించారు. రైతుల జోలికొస్తే చూస్తూ ఊరుకునేది లేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పువ్వల దుర్గాప్రసాద్, సీపీఐ(ఎంఎల్) ప్రజపంథా జిల్లా కార్యదర్శి గోకినపల్లి వెంకటేశ్వరరావు, టీడీపీ జిల్లా నాయకులు కొండపాల కరుణాకర్ ఈ కార్యక్రమంలో పాల్గొని రైతులకు మద్దతును తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర
కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బాగం హేమంతరావు, ఖమ్మం జిల్లా కార్యదర్శిలు నున్నా నాగేశ్వరరావు, పోటు ప్రసాద్, రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు, రైతు సంఘాల నాయకులు కొడపర్తి గోవిందరావు, బొంతు రాంబాబు, జిల్లా కమిటీ సభ్యులు ఎస్. నవీన్ రెడ్డి, రైతు జేఏసీ నాయకులు తక్కెలపాటి భద్రయ్య, వేములపల్లి సుధీర్, నాగండ్ల శ్రీధర్, మందనపు రవీందర్, వేముల సతీష్, పెంట్యాల వెంకటేశ్వర్లు నగర కాంగ్రెస్ నాయకులు ఎస్డీ. జావిద్, కార్పొరేటర్ మిక్కిలినేని నరేంద్ర, రైతు సంఘాలు, మహిళ సంఘాలు, నగర కాంగ్రెస్ కార్పొరేటర్లు, యువజన సంఘాల నాయకులు పాల్గొని మద్దతు తెలియజేశారు.