- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
వరద ప్రభావిత ప్రాంతాలను పర్యటించిన కలెక్టర్
by Sridhar Babu |

X
దిశ, దుమ్ముగూడెం : మండలంలో పలు వరద ప్రభావిత ప్రాంతాలను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా బుధవారం పర్యటించి పరిశీలించారు. గత సంవత్సరం వచ్చిన వరదలలో పూర్తిగా నష్టపోయిన సున్నం బట్టి గ్రామానికి ఇప్పటికే ప్రధాన రహదారితో సంబంధాలు తెగిపోయాయి. పూర్తిగా మునిగిపోయిన రహదారిని కలెక్టర్ పరిశీలించారు. అనంతరం స్థానిక అధికారులను అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు వరద పరిస్థితిని పర్యవేక్షించాలని సూచించారు. పర్యటనలో కలెక్టర్ తో పాటు స్థానిక ఎంపీడీవో ముత్యాలరావు, తహసీల్దార్ మనిధర్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
Next Story