- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ప్రసవాలకు ముహూర్తాలు వద్దు.. కమిషనర్ను ఆదేశించిన కలెక్టర్

దిశ,కొత్తగూడెం: ముహూర్తాల ప్రకారం ప్రసవాలు కావాలనే వారిని ప్రోత్సహించొద్దని జాప్యం చేయక ప్రసవాలు చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ వైద్యాధికారులకు సూచించారు. మంగళవారం రామవరంలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. వార్డులను పరిశీలించారు. ఎర్లీ ఇన్వెస్టిగేటింగ్ కేంద్రాన్ని వినియోగంలోకి తీసుకురావాలని చెప్పారు. చికిత్సల కొరకు వచ్చిన ప్రజలను వైద్య సేవలు గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో సర్వారం గ్రామానికి చెందిన భూక్యా రాజేష్ తన కుమారుడిపై పిచ్చి కుక్క దాడి చేసిందని, తన కుమారుడికి శస్త్ర చికిత్స అవసరమని చెప్పగా ఆరోగ్య శ్రీ ద్వారా ఉచిత శస్త్ర చికిత్సలు చేయిస్తామని చెప్పారు.
సహాయకుల కొరకు వచ్చే వారికి ఆసుపత్రి బయట స్థలంలో మరుగుదొడ్లు నిర్మించాలని మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. ఆసుపత్రి నుండి వెలువడే బయో వ్యర్థాలను ఆరు బయట వేయొద్దని సూచించారు. పరిసరాల పరిశుభ్రత బాగుందంటూ మున్సిపల్ సిబ్బందిని అభినందించారు. ఏ రోజు వ్యర్థాలను ఆ రోజు తొలగిస్తున్నారని, ఇలానే పరిశుభ్రంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ప్రాంగణంలో ఖాళీ స్థలాన్ని అందంగా గ్రీనరీతో ముస్తాబు చేయాలని చెప్పారు. ఆసుపత్రి ప్రాంగణంలో మాతా శిశు విగ్రహం ఏర్పాటు చేయాలని చెప్పారు. ఆసుపత్రిలోకి పశువులు వస్తున్నాయని, ప్రహరి నిర్మాణ పనులను వేగవంతం చేయాలని టీఎస్ఎస్ఐఐసి అధికారులను ఆదేశించారు.
వీధిలైట్లు ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. పార్కులో పిల్లలు ఆడుకునేందుకు ఆట పరికరాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. ప్రజలకు సురక్షిత తాగు నీరు అందించేందుకు ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటుతో పాటు మూడు వాటర్ కూలర్లు ఏర్పాటు ప్రక్రియను ఈ నెలాఖరు వరకు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఆపరేషన్లు లేకుండా సాధారణ ప్రసవాలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఆపరేషన్ చేయాల్సి వస్తే అందుకు కారణాలను నమోదు చేయాలని చెప్పారు. ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న ప్రసూతి వైద్యుని నియామకానికి చర్యలు చేపట్టాలని ఆసుపత్రుల సమన్వయ అధికారిని ఆదేశించారు.