రైతు దినోత్సవం నిర్వహణపై కలెక్టర్ గౌతమ్ ఆరా

by Sridhar Babu |
రైతు దినోత్సవం నిర్వహణపై కలెక్టర్ గౌతమ్  ఆరా
X

దిశ,కామేపల్లి : తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం కామేపల్లి మండలం పండితాపురం గ్రామంలో ఘనంగా రైతు దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ ఏర్పాట్లను కలెక్టర్ పీవీ గౌతమ్ పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతు దినోత్సవం చేపట్టిన తీరును, సమావేశం కరపత్రాల పంపిణీ, భోజనం విషయమై వివరాలును కామేపల్లి తహసీల్దార్ కె.రవికుమార్, ఎంపీడీవో కె.విజయ్ భాస్కర్ రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కామేపల్లి ఎంపీఓ జి.వెంకట సత్యనారాయణ, కొమ్మినేపల్లి సర్పంచ్ మూడ్ దుర్గా జ్యోతి, కొండాయిగూడెం సొసైటీ చైర్మన్ ధనియాకుల హనుమంతరావు, పంచాయతీ కార్యదర్శి బి. నెహ్రూ, ఏఈఓ ఎస్ కె.మున్ని పాల్గొన్నారు.



Next Story

Most Viewed