- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
పాఠశాలలో భోజనం చేసిన కలెక్టర్.. నిత్యం ''సాంబారే'' అని విద్యార్థుల ఆవేదన

దిశ, మణుగూరు: జాతీయ సమైక్యత వజ్రోత్సవాలలో భాగంగా భద్రాద్రి జిల్లా కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి మణుగూరు మండలంలో పర్యటించారు. శుక్రవారం మండల తహసీల్దార్ కె.నాగరాజు, ఎండీవో వీరబాబు ఆధ్వర్యంలో స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేస్తున్న వజ్రోత్సవాల ఏర్పాట్లను పరిశీలించారు. మండలంలో 16వ తేదీన జరిగే జాతీయ సమైక్యత వజ్రోత్సవంలో ప్రతి మండలం నుంచి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనేటట్లు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. వజ్రోత్సవ కార్యక్రమాలకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పారు.
కలెక్టర్ వచ్చిన సాంబారే.. రాకపోయినా సాంబారే..
వజ్రోత్సవాల ఏర్పాట్లపై అన్ని శాఖల అధికారులతో చర్చలు జరిపిన అనంతరం కలెక్టర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులతో కలిసి మధ్యాహ్నం భోజనం చేశారు. ఓ పక్కా కలెక్టర్ విద్యారులతో భోజనం చేస్తుంటే ఇంకో పక్క విద్యార్థులు ''కలెక్టర్ వచ్చిన సాంబారే.. రాకపోయినా సాంబారే..'' అని చర్చించుకోవడం సంచలనంగా మారింది. భోజనం ఎలా పెడుతున్నారని కలెక్టర్ విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఉడకని అన్నం, నీళ్ల సాంబార్తో నిత్యం తినలేకపోతున్నామని విద్యార్థులు కలెక్టర్ ముందు ఆవేదన వ్యక్తం చేశారు.
దిగమింగుతూ భోజనం చేసిన మండల అధ్యక్షురాలు..
కలెక్టర్తో పాటు స్థానిక మండల అధ్యక్షురాలు విద్యార్థులతో కలిసి మధ్యాహ్నం భోజనం చేశారు. అయితే భోజనంలో కూర్చున్న మండల అధ్యక్షురాలు భోజనం తినాలా.. వద్దా అనే రీతిలో దిగమింగుతూ భోజనం చేశారని అక్కడ ఉన్న విద్యార్థులు, కొందరు వ్యక్తులు మాట్లాడుకోవడం సంచలనంగా మారింది. పాఠశాల భోజనం ఒక్క పూట తినడానికే మండల అధ్యక్షరాలు ఆలోచిస్తే.. మరీ నిత్యం విద్యార్థులు ఎలా తింటున్నారని అక్కడ ఉన్నవారు మాట్లాడుకోవడం చర్చనీయంగా మారింది. కలెక్టర్, ప్రజాప్రతినిధులు విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిచాలని చెబుతున్నప్పటికీ.. విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణ లేక సిబ్బంది, ఉపాధ్యాయులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై అధికారులు దృష్టి సారించి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు
ఇవి కూడా చదవండి ల: ఇల్లందులో కాంగ్రెస్కు షాక్.. చక్రం తిప్పిన ఎమ్మెల్యే హరిప్రియ నాయక్