'అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం'

by Vinod kumar |
అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం
X

దిశ ప్రతినిధి, కొత్తగూడెం: ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, కార్యాలయ సబార్డినేట్ వివరాలు అందజేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశపు హాల్‌లో ప్రభుత్వ శాఖల్లో ఖాళీల వివరాలు, కేజీబీవీ విద్యార్థులకు వైద్య సేవలు, ఎస్సీఏ నిధులు ద్వారా చేపట్టిన పనులు, దళిత బంధు, గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణాలు, జిల్లా వెబ్‌సైట్‌లో శాఖల సమాచారం అప్‌లోడ్, ఆసుపత్రుల్లో బయోమెట్రిక్ హాజరు, బూస్టర్ డోస్ ప్రక్రియ, పాఠశాలలో జరుగుతున్న ఎల్. ఎఫ్. యన్. సర్వే తదితర అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ మరణించిన కుటుంబ సభ్యులకు ఉద్యోగ అవకాశం కల్పనకు కారుణ్య నియామకాలు చేపట్టేందుకు ఖాళీగా ఉన్న జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, కార్యాలయ సబార్డినేట్ వివరాలు అందచేయాలని చెప్పారు. కొవిడ్ నియంత్రణకు చేపట్టిన బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్ ప్రక్రియ జిల్లాలో 58 శాతం మాత్రమే జరిగిందని, వేగవంతం చేసేందుకు ఎంపీడీఓ లు, ఎంపీఓ లు చర్యలు చేపట్టాలని చెప్పారు.


కేజీబీవీ ల విద్యార్థుల ఆరోగ్య సర్వే ప్రక్రియ ప్రకారం రక్తహీనత అధిగమించేందుకు నిరంతర వైద్య సేవలు అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు. నిర్మాణం పూర్తయిన ప్రభుత్వ భవనాలను ఆయా నియోజకవర్గ ప్రజా ప్రతినిధులతో ప్రారంభోత్సవాలు నిర్వహించి వినియోగంలోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. నిర్మాణం పూర్తయిన గ్రామ పంచాయతీ భవనాలను ప్రారంభించి విధులు నిర్వహణకు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పారు. దళిత బంధు పథకంలో ఎంపికై యూనిట్లుకు ఆయా కంపెనీలకు 24 గంటల్లో నిధులు జమ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ని, ఎల్దియం లను ఆదేశించారు. నిధులు జమ కావడం జాప్యం కాకుండా చర్యలు చేపట్టాలని చెప్పారు.

ప్రభుత్వ ఆస్పత్రుల్లో సిబ్బంది సమయపాలన పాటించేందుకు బయో మెట్రిక్ తప్పక అమలు చేయాలని, గత నెల బయో మెట్రిక్ హాజరు వివరాలు అందచేయాలని ఆసుపత్రుల సమన్వయ అధికారికి సూచించారు. ఎస్సిఏ నిధుల ద్వారా చేపట్టిన పనులపై నివేదికలు అందజేయాలని చెప్పారు. శాఖల వారిగా సమాచారాన్ని జిల్లా పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలని చెప్పారు.



Next Story

Most Viewed