తుఫాను బాధితుల కోసం విరాళాల సేకరణ

by Sridhar Babu |
తుఫాను బాధితుల కోసం విరాళాల సేకరణ
X

దిశ, టేకులపల్లి : ఇటీవల వచ్చిన తుఫానుతో జిల్లాలో నష్టపోయిన వారి కోసం సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో విరాళాలు, వస్తువులను సేకరించారు. ఈ సందర్భంగా సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు డి.ప్రసాద్,టేకులపల్లి మండల సబ్ డివిజన్ కార్యదర్శి కల్తి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గుండాల మండలంలో ముత్తాపురంతో సహా ఏడు గ్రామాలు నీట మునిగిపోయాయని తెలిపారు. నర్సాపురం అనే గ్రామంలోని ఇండ్లతో సహా కొట్టుకుపోయాయని తెలిపారు. వారిని ఆదుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని వారు అన్నారు.

అలాగే గత సంవత్సరం పండించిన పంట ఇంట్లో నిల్వ చేసుకోగా అది కూడా కొట్టుకుపోయిందని అన్నారు. అధికారులు సర్వేలు చేస్తున్నారే తప్పితే ఆదుకుందామనే ఆలోచన లేదన్నారు. అందుకే తాము వారికి కావలసిన నిత్యావసర సరుకులని, బట్టలని సేకరించి అందజేయనున్నట్టు చెప్పారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి సర్వే చేపించి, తుఫాను బాధితులకు ఒకొక్కరికి 5 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్​ చేశారు. కార్యక్రమంలో టేకులపల్లి సబ్ డివిజన్ నాయకులు ఎట్టి నర్సింహారావు, శంకరాచారి, శంకర్ పాల్గొన్నారు.



Next Story

Most Viewed