- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
రేపు జిల్లాకు సీఎం రాక
by Sridhar Babu |

X
దిశ, ఖమ్మం సిటి : రాష్ట్రవ్యాప్తంగా రెండు రోజుల క్రితం కురిసిన అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులను రేపు ముఖ్యమంత్రి కేసీఆర్ పరామర్శించనున్నారు. కరీంనగర్, వరంగల్ జిల్లాలతో సహా ఖమ్మం జిల్లాలోని వైరా నియోజకవర్గం బోనకల్ మండలంలో ఆయన పర్యటించనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ ఆధ్వర్యంలో బోనకల్ మండలంలో హెలిప్యాడ్ ఏర్పాట్లను బుధవారం పరిశీలించారు. ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ మాట్లాడుతూ వడగళ్ల వర్షాలతో రైతులకు జరిగిన పంట నష్టాన్ని స్వయంగా పర్యటించి అంచనా వేసేందుకు, రైతులకు భరోసా కల్పించేందుకు నేడు ఉదయం 11:30 గంటలకు ఖమ్మం జిల్లా బోనకల్ మండలం లక్ష్మీపురం గోవిందపురం గ్రామంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించనున్నట్లు వివరించారు.
Next Story