- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
సీఎం కేసీఆర్ ఒక విజన్ తో పని చేస్తున్నారు : ఎమ్మెల్యే భానోత్ హరిప్రియ

దిశ,కామేపల్లి : తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికి ఒక రోల్ మోడల్ గా చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ విజన్ తో పని చేస్తున్నారని ఇల్లందు ఎమ్మెల్యే భానోత్ హరిప్రియ అన్నారు. శుక్రవారం ముచ్చర్ల లక్ష్మీ ఫంక్షన్ హాల్ లో ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సమ్మేళనానికి కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ముచ్చర్ల అంతా గులాబీ మయంగా మారింది. బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హరిప్రియ పాల్గొని మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం రాష్ట్రానికి శ్రీరామ రక్ష అన్నారు.
ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికి ఒక ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ముఖ్యమంత్రి లక్ష్యమన్నారు. ప్రజల అండదండలు ఉన్నంతకాలం సీఎంను ఎవరూ ఏం చేయలేరన్నారు. రాష్ట్ర సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శం అన్నారు. ఈ కార్యక్రమంలో కామేపల్లి మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ధనియాకుల హనుమంతరావు, ఎంపీపీ బి. సునిత, కామేపల్లి మండల రైతు బంధు సమన్వయ సమితి కోఆర్డినేటర్ అంతోటి అచ్చయ్య, కామేపల్లి సర్పంచ్ అజ్మీర రాందాస్, పార్టీ నేతలు ఎం. కృష్ణ ప్రసాద్, జాటోత్ జాయ్ లూసీ, చిదంబరావు, కన్నమాల రాంబాబు, చందర్ రావు, గండమాల రమేష్ పాల్గొన్నారు.