- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
మణుగూరు కాంగ్రెస్లో బహిర్గతమవుతున్న వర్గ విభేదాలు..
by Mahesh |

X
దిశ, మణుగూరు: మణుగూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని 'నేనంటే.. నేను' అంటూ ఇద్దరు నాయకులు ప్రచారం చేసుకుంటుండడంతో పార్టీలో వర్గ విభేదాలు బహిర్గతమవుతున్నాయి. ఇటీవల పిరినాకి నవీన్ ను మండల అధ్యక్షుడిగా డీసీసీ అధ్యక్షుడు పొదెం వీరయ్య నియమించారు. ఇది ఇలా ఉండగా గతంలో మండల అధ్యక్షుడిగా పనిచేసిన గురజాల గోపి కూడా మండల అధ్యక్షడిని తానే అని ప్రచారం చేసుకోవడంతో జిల్లా, నియోజకవర్గ స్థాయి నాయకులు తలలు పట్టుకుంటున్నారు. మండల పరిధిలోని కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని సమష్టిగా పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేయాల్సిన సమయం లో వర్గ విభేదాల నడుమ కొట్టుమిట్టాడుతున్న మండల కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ముందుకు వస్తుందో వేచి చూడాల్సిందే.
Next Story