ఖమ్మం మిర్చి మార్కెట్‌లో ఘర్షణ.. తలపడ్డ రైతులు, వ్యాపారి

by sudharani |
ఖమ్మం మిర్చి మార్కెట్‌లో ఘర్షణ.. తలపడ్డ రైతులు, వ్యాపారి
X

దిశ, ఖమ్మం సిటీ : ఖమ్మం మిర్చి మార్కెట్‌లో రైతులకు, కమీషన్‌దారుడి మధ్య ఘర్షణ జరిగింది. తన దగ్గర అప్పు తీసుకుని మిర్చిని మరో వ్యాపారికి విక్రయిస్తుండటంతో వివాదం చెలరేగి దాడి చేసుకునే వరకు వెళ్లింది. రైతులు, వ్యాపారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం రూరల్ మండలం తీర్దాల గ్రామానికి చెందిన ధర్మసోత్ మదన్ వ్యవసాయ పెట్టుబడుల కోసం కమిషన్ దారు వడ్డే వెంకటేశ్వర్లు వద్ద అప్పు తీసుకున్నాడు. వచ్చిన పంటను ఆయనకే విక్రయిస్తానని హామీ ఇచ్చాడు.

కానీ శనివారం మిర్చి మార్కెట్‌కు వచ్చిన మదన్.. తన పంటను మరో కమీషన్‌దారుడికి విక్రయిస్తుండటంతో విషయం తెలుసుకున్న వడ్డే వెంకటేశ్వర్లు రైతును ప్రశ్నించాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో ఆగ్రహానికి గురైన మదన్ తోటి రైతులతో కలిసి కమీషన్‌దారుడిపై దాడికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న 3వ టౌన్ పోలీసులు మార్కెట్‌కు చేరుకుని రైతును కమీషన్ దారురుడిని స్టేషన్‌కు తరలించారు. మరోవైపు కమీషన్ దారుడిపై రైతు దాడికి పాల్పడ్డడాని వ్యాపారులు కొనుగోళ్లు ఆపేశారు. కాగా, పోలీస్ స్టేషన్‌లో రైతుకు, వ్యాపారి మధ్య కమీషన్ దారులు రాజీ కుదిర్చినట్లు సమాచారం.



Next Story

Most Viewed