పండితాపురంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ఘర్షణ

by Sridhar Babu |
పండితాపురంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ఘర్షణ
X

దిశ,కామేపల్లి : ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం పండితాపురం గ్రామంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గీయుల మధ్య మంగళవారం ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో బీఆర్ఎస్ కార్యకర్తలపై పొంగులేటి అనుచరులు దాడి చేశారు. వారిపై విచక్షణా రహితంగా దాడి చేసి కొట్టారు. చల్లా శశి అనే వ్యక్తిని అడ్డుకొని దాడి చేశారు. ఈ దాడిలో చల్లా వెంకటనారాయణ, చల్లా రవి చేతులు విరిగిపోయాయి. చల్లా శశి అనే యువకుడి తలపై కొట్టడంతో అపస్మారక స్థితి లోకి వెళ్లాడు. క్షతగాత్రులను ఖమ్మం ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించి వైద్య సేవలు అందించారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మెరుగైన వైద్య సేవల కోసం శశిని హైదరాబాద్ తరలించారు. ప్రస్తుతం గ్రామంలో పోలీసులు 144 సెక్షన్ విధించారు.



Next Story