- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
దేశాభివృద్ధికి క్రైస్తవమే కారణం : తెలంగాణ హెల్త్ డైరెక్టర్

దిశ ప్రతినిధి, కొత్తగూడెం : దేశాభివృద్ధికి క్రైస్తవమే కారణమని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. జీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బుధవారం కొత్తగూడెం శ్రీనగర్లోని జరహిత భవనంలో సెమీ క్రిస్మస్ వేడుకలను జీఎస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ట్రస్టు వ్యవస్థాపకులు గడల శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ భారతదేశ అభివృద్ధికి క్రైస్తవమే కారణమని, ఆ మతమే మానవ మనుగడకు, అభివృద్ధికి కారణమని అన్నారు. ఆధునిక సంస్కృతికి వారధి క్రైస్తవమే అని పేర్కొన్నారు. క్రైస్తవ మతం లేకపోతే ప్రపంచంలో భారత దేశ మరుగడ సాధించలేకపోయేది అని తెలిపారు. ఆధునిక విద్య, వైద్యం, సంస్కృతి తీసుకువచ్చి ప్రపంచ దేశాల్లో భారతదేశానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చి పెట్టింది క్రైస్తవమే అని అన్నారు. ఏసుక్రీస్తు దయ వల్లే కరోనా తగ్గుముఖం పట్టింది అంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. ఈయన ఏ కార్యక్రమం తలపెట్టినా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుండడంపై వాడివేడి చర్చ జరుగుతుంది.