- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఉసురు తీసిన మిర్చి సాగు
by Sridhar Babu |

X
దిశ, జూలూరుపాడు : పెట్టుబడి తిరిగి రాదని కౌలు రైతు ఆత్మహత్య చేసుకొని చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. భద్రాద్రికొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం అన్నారుపాడు గ్రామానికి చెందిన బాధావత్ వెంగళరావు 4 ఎకరాల పొలం కౌలుకుతీసుకొని మిర్చి పంట వేశాడు. మిర్చి పంటకు తెగుళ్లు రావడంతో పెట్టిన పెట్టుబడి రాదేమో అని భయంతో 13వ తేదీన చేను వద్దకు వెళుతున్నానని భార్య లక్ష్మి కి చెప్పి మళ్లీ ఇంటికి తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు చేను వద్ద వెతకగా అక్కడ అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. దాంతో వెంగళరావు ను ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేస్తుండగా 14వ తేదీ రాత్రి చనిపోయాడు. భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story