- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఖమ్మం మార్కెట్ కు పోటెత్తిన మిర్చి

దిశ, ఖమ్మం సిటీ : ఖమ్మం మార్కెట్లో మిర్చి పెద్ద ఎత్తున పోటెత్తింది. గత వారం రోజులుగా పెరిగిన ఎండల కారణంగా మిర్చి తోటల్లో పంట రైతు కోయడంతో అవి పూర్తిగా ఎండి గత మూడు నాలుగు రోజులుగా మార్కెట్ కు 50 వేలకు పైచిలుకు బస్తాలతో మార్కెట్ నిండుతూ వస్తుంది. మంగళవారం ఒక్కరోజే 80 వేల బస్తాలు దాటినట్లు వ్యాపారులు చెబుతున్నారు. మార్కెట్ మద్దతు ధర డీలక్స్ రకం సరుకులకు రూ.23000 పలుకుతుంది. మామూలు రకం క్వాలిటీ అయితే రూ. 19 వేల నుండి రూ.21 వేల వరకు పలుకుతుందని రైతులు తెలుపుతున్నారు. ఒక్కసారి గా మిర్చి పెద్ద ఎత్తున మార్కెట్కు తరలి రావడంతో రోడ్లపై పదుల సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. దాంతో కొద్దిసేపు ట్రాఫిక్ అంతరాయం చోటుచేసుకుంది. ట్రాఫిక్ ను నియంత్రించేందుకు పోలీసులు నానా అవస్థలు పడాల్సిన పరిస్థితి ఎదురైంది. మార్కెట్ బయట కార్పొరేషన్ అధికారులు డ్రైనేజీ ఏర్పాటు కోసం గుంతలు తీయడంతో పత్తి యార్డు లోపలికి మిర్చిని తరలించేందుకు హమాలీలు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో మిర్చి బస్తాలను కాలవలో వేసి మార్కెట్ లోపలికి హమాలీలు మోసుకుపోయారు.