భళా గిరి బిడ్డలు

by Sridhar Babu |
భళా గిరి బిడ్డలు
X

దిశ, భద్రాచలం : గిరిజన విద్యార్థినిలు తమ ప్రతిభ చాటారు. గిరిజన గురుకులాలను అగ్రస్థానంలో నిలిపారు. కార్పొరేట్ విద్యా సంస్థలకు సవాలు విసిరారు. డాక్టర్ కోర్స్ లోనే కాదు, అన్ని కోర్సుల్లో విజయ బావుటా ఎగురవేశారు. రాష్ట్రస్థాయి ర్యాంకులను కైవసం చేసుకుని తమ సత్తా చాటారు. భద్రాచలం గిరిజన గురుకులంలో చదివిన గిరిజన బాలికలు మరోసారి రాష్ట్రస్థాయిలో తమ ప్రతిభ పాఠవాలు ప్రదర్శించి అత్యున్నత పురస్కారాలకు నోచుకున్నారు. ఎన్ ఐ టీ, ఇంటర్ లో అత్యున్నత మార్కులు కైవసం చేసుకుని తమ సత్తా చాటిన భద్రాచలం గిరిజన గురుకులం బాలికలు ప్రత్యేక నగదు పురస్కారం, సన్మానం అందుకోనున్నారు. ఇందుకు సంబంధించి తమ విద్యార్థినిలకు గిరిజన సంక్షేమ శాఖ నుంచి ప్రత్యేక ఆహ్వానం అందినట్లు భద్రాచలం గిరిజన గురుకుల బాలికల పాఠశాల, కళాశాల ప్రిన్సిపాల్ ఎం.దేవదాసు వెల్లడించారు. ఈనెల 17న హైదరాబాద్ రవీంద్రభారతిలో వీరికి నగదు పురస్కారంతోపాటు, సన్మానం కూడా ప్రభుత్వం చేయనున్నట్లు తెలిపారు.

గత ఏడాది భద్రాచలం గిరిజన గురుకులంలో చదివిన పి.చందన ప్రస్తుతం ఎన్ఐటీ అమీర్పూర్ లో చదువుతోందని ఈ విద్యార్థినికి రూ.40,000 నగదు, ల్యాప్టాప్, బి.ప్రియాంక ఎన్ఐటీ రూర్కెలాలో చదువుతుందని ఈ విద్యార్థినికి కూడా రూ.40,000 ల్యాప్టాప్ ప్రభుత్వం అందజేస్తుందని పేర్కొన్నారు. హెచ్ఈసీలో గురుకులం టాపర్ గా ఎస్టీ విభాగం నుంచి జీ.నవ్య 959/1000 కు రూ.25000, ఏటీలో టాపర్గా వచ్చిన టి.కీర్తనకు 971/1000 రూ.25000, సీఎస్ లో టాపర్ గా వచ్చిన కె. త్రిష 986/1000 కు రూ.25000, ఐఎమ్ లో టాపర్గా వచ్చిన ఎస్. సౌభాగ్య 975/1000కు రూ.25000, పీఎస్టీటి గ్రూపులో టాపర్ గా వచ్చిన ఎస్.మల్లేశ్వరి 976/1000కి రూ.25000 నగదు పురస్కారం, సన్మానం అందుకోనున్నారు.

గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో ఈ కార్యక్రమం జరగనుందని ప్రిన్సిపాల్ వెల్లడించారు. గిరిజన సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు, భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్ గౌతమ్ పోట్రు , భద్రాచలం ఐటిడిఏ ఏపిఓ జనరల్, గిరిజన గురుకులాల ప్రాంతీయ సమన్వయ అధికారి, డి.డి డేవిడ్ రాజ్ , కళాశాల స్టాప్ సహాయ సహకారాలతో తమ కళాశాల పిల్లలు అత్యున్నత మార్కులు కైవసం చేసుకుని అగ్రభాగాన నిలిచారని ప్రిన్సిపాల్ ఎం. దేవదాస్ ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేశారు.



Next Story

Most Viewed