లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ

by S Gopi |
లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ
X

దిశ, బూర్గంపాడు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదేశాల మేరకు శుక్రవారం బూర్గంపాడు మండలంలోని లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను బూర్గంపాడు జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత చేతులమీదుగా పంపిణీ చేశారు. బూర్గంపాడు పంచాయతీలో రూ. 22.2 లక్షల విలువ గల చెక్కులను పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో బూర్గంపాడు మండల బీఅర్ఎస్ పార్టీ అధ్యక్షులు గోపీరెడ్డి రమణారెడ్డి, బూర్గంపాడు మండల యూత్ ప్రెసిడెంట్ గోనేల నాని, మండల ప్రధాన కార్యదర్శి జక్కం సుబ్రమణ్యం, బూర్గంపాడు టౌన్ ఎస్సీ సెల్ అధ్యక్షులు మందా ప్రసాద్, బూర్గంపాడు టౌన్ యూత్ ప్రెసిడెంట్ కన్నేపల్లి సతీశ్, టౌన్ ప్రధాన కార్యదర్శి కేసుపాక రమేష్, మాజీ ఎంపీటీసీ సభ్యులు జక్కం సర్వేశ్వర రావు, కేసుపాక బోందయ, బర్ల సత్యనారాయణ, కేసుపాక మహేష్, తోకల శ్రీను, సోషల్ మీడియా అధ్యక్షులు గంగపురి చంద్ర శేఖర్ తదితరులు పాల్గొన్నారు.



Next Story