- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
బదిలీల్లో తప్పుడు వైద్య ధృవీకరణ పత్రాలకు చెక్ : కలెక్టర్ అనుదీప్

దిశ ప్రతినిధి,కొత్తగూడెం : ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ నిర్వహణలో తప్పుడు వైద్య ధృవీకరణ పత్రాలు జారీ నియంత్రణకు మెడికల్ బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. శుక్రవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, టీఎస్ఈ డబ్ల్యూఐడీసీ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి, కార్యదర్శి అరుణ, డైరెక్టర్ శ్రీదేవి సేన ఉపాధ్యాయుల బదిలీలు, మన ఊరు మనబడి, మోడల్ స్కూల్ ప్రారంభోత్సవాల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 25 మోడల్ పాఠశాలలు ఈ నెలాఖరు నాటికి ప్రారంభించడానికి సిద్ధం చేసినట్లు చెప్పారు. 21 పాఠశాలలో రంగులు వేయడానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. మన ఊరు - మన బడి కార్యక్రమంలో ఎంపిక చేసిన మోడల్ పాఠశాలల్లో డ్యూయల్ డెస్కులు, హైస్కూళ్లల్లో సోలార్ ప్యానల్స్, గ్రీన్ చాక్ బోర్డులు ఏర్పాటుపై నివేదిక అందజేయాలని అధికారులకు ఆదేశించినట్లు పేర్కొన్నారు. ఉపాధ్యాయల బదిలీలలకు సంబంధించి సీనియారిటీ జాబితా డీఈఓ కార్యాలయంలో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఉపాధ్యాయులు బదిలీల ప్రక్రియలో వైద్య ధృవీకరణ పత్రాలు జారీకి మెడికల్ బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బీ ఈఈ భీంలా, పీఆర్ఈ సుధాకర్, గిరిజన సంక్షేమ శాఖ ఈఈ తానాజీ, ఇరిగేషన్ ఈ ఈ సురేష్ తదితరులు పాల్గొన్నారు.