- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
రైతు రుణమాఫీని వెంటనే అమలు చేయాలి.. బొంతు రాంబాబు

దిశ, వైరా : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వ్యవసాయ విధానాలు అన్నదాతలకు వ్యతిరేకంగా ఉన్నాయని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు అన్నారు. సోమవారం వైరా నియోజకవర్గ కేంద్రంలో తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏక కాలంలో లక్ష రూపాయలు రుణమాఫీ వెంటనే చేయాలన్నారు. ధరణి సమస్యలు పరిష్కారం చేయాలని, సాదాబైనమా దరఖాస్తులు పరిశీలించి అర్హులైన వారికి పాస్ పుస్తకాలు మంజూరు చేయాలన్నారు. అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు పరిహారం పంపిణీ లో మిస్ అయిన రైతులకు పరిహారం అందించాలి అని డిమాండ్ చేశారు.
అనంతరం వైరా తహశీల్దార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి ఐదు సంవత్సరాల అవుతున్నా రైతు రుణమాఫీ చేయలేదన్నారు. రెండు విడతలుగా, ఇరవై ఐదు వేల, ముఫై ఐదు వేల రూపాయలు రుణం ఉన్న రైతులకు మాత్రమే నేటివరకు మాఫీ అయిందని, మిగితా రైతులు రుణమాఫీ కోసం ఎదురు చూసి సకాలంలో బ్యాంకులకు తిరిగి రుణాలు చెల్లించకపోవడంతో అధిక వడ్డీ భారం రైతులపై పడుతుందన్నారు. ధరణి పోర్టల్ రద్ధు చేయడం కాకుండా సాగు భూములు కల్గి ఉన్న రైతులు అందరికీ ధరణి పోర్టల్ ద్వారా పాస్ పుస్తకాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. నాలుగు సంవత్సరాల క్రితం ప్రభుత్వం సేకరించిన సాధాబైనం దరఖాస్తులు పరిశీలించి అర్హులైన వారికి పాస్ పుస్తకాలు మంజూరు చేయాలన్నారు. మార్చి, ఏప్రిల్ నెలల్లో కురిసిన వర్షాలకు దెబ్బతిన్న పంటలకు రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ లో మిస్ అయిన రైతులకు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ విధానాలు రైతులకు వ్యతిరేకం గా ఉన్నాయని, పంటల బీమా పథకం సమగ్ర విత్తన విధానం లేకపోవడం వల్ల రైతులు లక్షల కోట్ల రూపాయల వ్యవసాయ సీజన్లో నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు అనుకూల పంటల బీమా, విత్తన విధానం రూపొందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం వైరా పట్టణ కార్యదర్శి చింతినిప్పు చలపతిరావు జిల్లా కమిటీ సభ్యులు వనమా చిన్న సత్యనారాయణ, వైరా మండల కార్యదర్శి కిలారు శ్రీనివాసరావు, సీపీఎం వైరా మండల కార్యదర్శి తోట నాగేశ్వరరావు, సోసైటి వైస్ చైర్మన్ కోణితన కోటేశ్వరరావు, బాణాల శ్రీనివాసరావు, హరి వెంకటేశ్వరావు, బెజవాడ వీరభద్రం, పైడిపల్లి సాంబశివరావు, సంక్రాంతి నర్సయ్య, పురుషోత్తం, ద్రోణాదుల నాగేశ్వరరావు, శీలం వెంకటరెడ్డి, తోట కృష్ణవేణి, ఎస్ కె జానిమియా మజీద్ బి, రహెన, ఫాతిమా, గట్టమ్మ, నర్వనేని చిన్న సత్యనారాయణ, వెంపటి రాజా, మురళి తదితరులు పాల్గొన్నారు.